Viral Video: తైవాన్ లో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు లై చింగ్ టె (Lai Ching-te)పై ఓ వృద్ధుడు వాంతు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అనూహ్య పరిణామంతో తైవాన్ ప్రెసిడెంట్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వారంతా కూడా ఈ ఘటన చూసి షాక్ కు గురయ్యారు.
చంద్ర నూతన సంవత్సరం సందర్భంగా తైవాన్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి తైవాన్ అధ్యక్షుడితో పాటు సాక్రిఫిషియల్ రైట్స్ మార్షల్ టెంపుల్ చీఫ్ లిన్ పీ హువో హజరయ్యారు. నిర్వాహకుల్లో ఒకరు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతుండగా అధ్యక్షుడు లై చింగ్ టె పక్కనే లిన్ నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో కాస్త అసౌకర్యానికి గురైన లిన్.. ఒక్కసారిగా వాంతు చేసుకున్నారు. నోటికి అడ్డుగా చేతిని పెట్టినప్పటికీ తుంపర్లు తైవాన్ అధ్యక్షుడి దుస్తులపై పడ్డాయి. దీంతో అక్కడి వారంతా షాక్ కు గురయ్యారు.
Taiwan President Lai Ching-te was accidentally splashed with vomit while handing out Lunar New Year red envelopes at a temple.
The temple chairman suddenly felt unwell and vomited during a speech. pic.twitter.com/cc4tpR38Ue
— Wunderkind (@EngineerNGR) February 18, 2026
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనాల ప్రకారం.. లిన్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి నోరో వైరస్ సోకింది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ క్రమంలోనే లిన్ కూడా అనారోగ్యానికి గురై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. మరోవైపు నోరో వైరస్ సులభంగా వ్యాపిస్తుందని అటు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. దేశాధ్యక్షుడిపై లిన్ వాంతి చేసుకున్నందున ఆయన ఆరోగ్యంపై కూడా ప్రస్తుతం ఆందోళనలు ప్రారంభమయ్యాయి.
మరోవైపు ఘటన అనంతరం తైవాన్ అధ్యక్షుడు మాట్లాడారు. లిన్ కుటుంబ సభ్యుల్లో కొంతమందికి నోరో వైరస్ సోకిందని ధ్రువీకరించారు. కాబట్టి ఆయన కూడా నోరో వైరస్ బారిన పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు తన వల్ల జరిగిన అంతరయానికి లిన్ స్వయంగా క్షమాపణలు చెప్పారు.
నోరో వైరస్ ఆందోళన నేపథ్యంలో ఘటనాస్థలిలో అంటు వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతాన్ని శుద్ది చేసేందుకు స్ప్రేలు చల్లారు. ప్రమాదకరమైన నోరో వైరస్.. బాధితుల శరీరం నుంచి వెలువడే తుంపర్లు (దగ్గు, తుమ్ములు, వాంతులు) ద్వారా వేగంగా వ్యాపిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.