E-Paper
Advertisement

Viral Video: దారుణం.. రీల్స్ పిచ్చితో ఏనుగు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు

Viral Video: దారుణం.. రీల్స్ పిచ్చితో ఏనుగు చేతిలో ప్రాణాలు కోల్పోయాడు
Advertisement

Viral Video: పెంపుడు జంతువులతో ఆటలు ఆడినా, వాటిపై ప్రేమ చూపించినా కూడా అవి మనపై తిరిగి ప్రేమను చూపిస్తాయి. అయితే సాధారణంగా అడవిలో ఉండే జంతువులు మాత్రం మనుషులను చూడగానే భయపడి పారిపోవడం లేక దాడి చేయడం వంటివి చేస్తుంటాయి. ముఖ్యంగా అడవిలో ఏనుగులు అయితే వాటికి కోపం తెప్పిస్తే ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. మనుషులపైకి కోపంతో ఘీంకారాలు చేస్తూ దూసుకువస్తాయి. అయితే తాజాగా ఓ ఏనుగుతో ఆటలాడాలని ప్రయత్నించిన ఓ వ్యక్తిని దారుణంగా తొక్కి చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది. అడవి నుంచి ఓ ఏనుగు గ్రామాల్లోకి ప్రవేశించింది. ఉదయం వేళ హబీబావాలా గ్రామంలోకి దూసుకువచ్చింది. దీంతో ఒక్కసారిగా గ్రామస్తులు ఏనుగులను చూసేందుకు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ తరుణంలో ఓ 30 సంవత్సరాల ముర్సాలీన్ అనే యువకుడు రీల్స్ పిచ్చితో ఏనుగుతోనే ఆటలాడేందుకు ప్రయత్నించాడు. ఏనుగును భయపెట్టాలని చూసిన తరుణంలో అది ఒక్కసారిగా అతడిపైకి దూసుకెళ్లింది. ఎంత దూరం పరుగులు తీసినా కూడా వెంటాడింది. ఈ తరుణంలో జనాలు కూడా పరుగులు తీశారు. ముర్సాలీన్ ను ఏనుగు తొక్కి చంపింది. తొండంతో ఏకంగా 25 అడుగుల ఎత్తుకు విసిరిపారేసింది.

Advertisement

ఏనుగు దాడిలో ముర్సాలీన్ తీవ్రంగా గాయాలపాలయ్యాడు. దీంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీల్స్ పిచ్చితో ఏనుగుతో ఆటలాడితే ఇలాగే ఉంటుంది అని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×