E-Paper
Advertisement

Kerala Boy Dies: టాయిలెట్ సీటును నాకించి.. తలను ఫ్లష్ లో ముంచి.. టీనేజర్ ని చంపి వాట్సాప్ లో జోకులు!

Kerala Boy Dies: టాయిలెట్ సీటును నాకించి.. తలను ఫ్లష్ లో ముంచి.. టీనేజర్ ని చంపి వాట్సాప్ లో జోకులు!
Advertisement

కేరళలో ఘోరం జరిగింది. ర్యాగింగ్ పేరుతో తోటి విద్యార్ధులు దారుణంగా ప్రవర్తించారు. చిత్రహింసలకు గురి చేశారు. అవమానాన్ని భరించలేక 15 ఏండ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 26వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఎర్నాకులం జిల్లా త్రిప్పునితురలో జరిగింది. జనవరి 15న విద్యార్థి చనిపోగా, అందరూ ఒత్తిడితో సూసైడ్ చేసుకున్నారని భావించారు. కానీ, తాజాగా ఆ విద్యార్ధి తల్లి.. కొడుకు మరణానికి గల కారణాలను వెల్లడించడంతో అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

కొడుకు ఎలా చనిపోయాడో ఆరా తీసిన తల్లి

Advertisement

మిహిర్ అనే 15 ఏండ్ల బాలుడు త్రిప్పునితురలోని గ్లోబల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాడు. రీసెంట్ గా ఆ అబ్బాయి, సూసైడ్ చేసుకున్నాడు. అయితే, తన కొడుకు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటని అతడి తల్లి ఆరా తీసింది. ఏ ఇబ్బందితో తను చనిపోయాడో తెలుసుకునే ప్రయత్నం చేసింది. తన భర్తతో కలిసి స్కూల్ సిబ్బందిని, తోటి విద్యార్ధులను అడిగింది. అతడి పుస్తకాలు, సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలించింది. అసలు విషయం తెలుసుకుని షాక్ అయ్యింది. తాజాగా తన కొడుకు మరణానికి గల కారణాను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. మిహిర్ ను తోటి విద్యార్ధులు ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురి చేశారని, ఆ అవమానాన్ని తట్టుకోలేక చనిపోయాడని వెల్లడించింది.

మరీ అంత దారుణంగా ప్రవర్తించారా?

Advertisement

మిహిర్ కు తోటి విద్యార్థుల నుంచి వేధింపులు తీవ్ర స్థాయిలో ఎదురయ్యాయని రాజ్మా తెలిపింది. తన కొడుకు పట్ల తోటి విద్యార్ధులు ర్యాగింగ్ పేరుతో క్రూరంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బెదిరింపులు, భౌతిక దాడులకు దిగారని చెప్పింది. అత్యంత ఘోరం టాయిలెట్ సీటు నాకించడంతో పాటు, టాయిల్ కమ్మోడ్ లో తలపెట్టి ఫ్లష్ కొట్టారంటూ కంటతడి పెట్టింది. ఈ టార్చర్ భరించలేకే తను చనిపోయాని చెప్పుకొచ్చింది. మిహిర్ కలర్ కూడా హేళన చేశారని చెప్పింది. నల్లోడా అంటే వేధించారని చెప్పింది. మిహిర్ మరణాన్ని కూడా ర్యాగింగ్ చేసిన విద్యార్థులు సెలబ్రేట్ చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్స్ ను షేర్ చేసింది.

ముఖ్యమంత్రికి, డీజీపీకి మిహిర్ పేరెంట్స్ లేఖ

అటు తన కొడుకు మృతికి కారణకులపై చర్యలు తీసుకోవాలని మిహిర్ పేరెంట్స్ సీఎం కార్యాలయంతో పాటు డీజీపీకి లేఖ రాశారు. తాము సేకరించిన ఆధారాలతో కేసు నమోదు చేయాలని కోరారు. పారదర్శకంగా కేసును విచారించి బాధ్యుతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి త్రిప్పునితుర హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

మిహిర్ పేరెంట్స్ ఆరోపణలను ఖండించి గ్లోబల్ స్కూల్

అటు మిహిర్ తల్లిదండ్రుల ఆరోపణలను గ్లోబల్ పబ్లిక్ స్కూల్ ఖండించింది. తమ  స్కూల్ మీద ర్యాగింగ్, బెదిరింపుల ఆరోపణలను రావడం బాధాకరంగా ఉందని తెలిపింది. తమ స్కూల్‌ లో తాము ఇలాంటి వాటిని సహించబోమని తేల్చి చెప్పింది. ఎలాంటి ఆధారాలు లేకుండా చర్యలు తీసుకోలేమని ప్రకటించింది.

Read Also: సూదులతో గుచ్చుతూ.. కొవ్వొత్తితో కాల్చుతూ.. 16 ఏళ్ల అమ్మాయిపై 44 రోజులు.. 100 మంది అలాంటి చర్య!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×