Ghaziabad: యూపీ ఘజియాబాద్ ప్రాంతంలోని ఓ హోటల్ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. హోటల్ మేనేజర్గా పని చేస్తున్న ఓ మహిళపై ఒక వ్యక్తి దాడి తెగబడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపై చర్చకు దారితీసింది. ఈ ఘటన వెనుక అసలేం జరిగింది?
ఘజియాబాద్లో దారుణమైన ఘటన
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఇందిరాపురం శక్తి బ్లాక్లో ఉన్న హోటల్ యువరాజ్లో ఈ ఘటన వెలుగు చూసింది. హోటల్కు వచ్చిన ఒక యువకుడు.. విధి నిర్వహణలో ఉన్న మహిళా మేనేజర్పై దాడికి తెగబడ్డాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన తర్వాత సదరు నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనతో నివ్వెరపోయిన బాధిత మహిళ, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు శివం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయాన్ని కొందరు అధికారులు ధృవీకరించారు.
మహిళా మేనేజర్పై యువకుడు దాడి, ఆపై నిందితుడు అరెస్ట్
హోటల్ ప్రాంగణంలో జరిగిన ఈ వివాదానికి కారణమైన విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని, దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మహిళలు పని చేయడం కష్టంగా మారిందని కొందరు చెబుతున్నారు.
దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటే మరొకరు ఇలాంటి పని చేయరని అంటున్నారు. నేరుగా సదరు వ్యక్తి వచ్చి కొట్టాడంటే అందుకు కారణాలు వేరే ఉంటాయని అంటుననవాళ్లూ లేకపోలేదు. దీనిపై లోతుడా దృష్టి సారించారు పోలీసులు.
ALSO READ: బంగారం కొనాలంటే లక్షలు అక్కర్లేదు.. రూ.185 చాలు.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో
హోటల్ మహిళా మేనేజర్పై యువకుడు దాడి
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్లోని ఇందిరాపురం శక్తి బ్లాక్లో ఉన్న 'హోటల్ యువరాజ్'లో ఒక ఘోర సంఘటన వెలుగుచూసింది. హోటల్కు వచ్చిన ఒక యువకుడు అక్కడ విధి నిర్వహణలో ఉన్న మహిళా మేనేజర్పై ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు. ఆమెపై విచక్షణారహితంగా దాడి చేసిన… pic.twitter.com/lHopQtTN5z
— BIG TV Breaking News (@bigtvtelugu) May 17, 2026