E-Paper
Advertisement

UP Train Incident: రైలు కిటికీ నుంచి జారిపడ్డ‌ చిన్నారి.. చిమ్మ చీకట్లో 16 కి. మీ.. సీన్ కట్ చేస్తే..

UP Train Incident: రైలు కిటికీ నుంచి జారిపడ్డ‌ చిన్నారి..  చిమ్మ చీకట్లో 16 కి. మీ.. సీన్ కట్ చేస్తే..
Advertisement

మధ్యప్రదేశ్ నుంచి యూపీలోని మథురకు వెళ్లేందుకు ఓ కుటుంబం తమ 8 ఏళ్ల చిన్నారితో రైలెక్కింది. ఈ ఫ్యామిలీ ఎమర్జెన్సీ కిటికీ దగ్గరున్న సీట్లలో కూర్చుకున్నారు. వెంటిలేషన్‌ కోసం కొందరు ప్రయాణికులు ఈ విండోను తెరిచారు. ఈ చిన్నారి ఉన్నట్టుండి కిటికీ నుంచి జారి కిందపడిపోయింది. వెంటనే అలర్ట్ అయిన చిన్నారి తండ్రి తర్వాత వచ్చే రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీసులకు ఈ విషయం చెప్పాడు.

Advertisement

ఝాన్సీ జీఆర్పీ పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగారు. మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి అర్థరాత్రి చిమ్మచీకట్లో గాలించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 కిలోమీటర్ల దూరం కాలినడకన గాలింపు చేపట్టారు. చివరికి పట్టాల పక్కన ఉన్న ఓ చెట్ల పొదల్లో చిన్నారి గాయాలతో కనిపించింది.

Also Read:  ‘మంచి భవిష్యత్తు కోసం మరో ఉద్యోగంలో చేరుతున్నా.. నచ్చకపోతే తిరిగి వస్తా’.. వింత రాజీనామా వైరల్

Advertisement

స్పృహకోల్పోయి గాయాలతో పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లకపోతే ప్రాణాలతో మిగలడం కష్టం అనేలా చిన్నారి పరిస్థితి ఉంది. ఆస్పత్రికి వెళ్దామంటే అక్కడ నుంచి రోడ్డు మార్గం కూడా లేదు. దీంతో.. అటుగా వెళ్తున్న గూడ్స్‌ రైలును ఆపి వెంటనే లలిత్‌పుర్‌కు తరలించారు. వైద్యులు కూడా త్వరగా స్పందిండంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. యూపీ పోలీసులు ఈ మొత్తం వీడియోని సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో.. పోలీసులు రియల్ హీరోలంటూ పోల్చుతూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×