Viral Video: కళ్ల ముందే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా.. రోడ్డు ప్రమాదాల రక్తం ఇంకా ఆరకముందే మరికొన్ని ప్రాణాలు బలి అవుతున్నా.. నేటి సమాజంలో కొంతమంది తీరు అస్సలు మారడం లేదు. తాజాగా ఓ యువకుడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న రైలు మీదకు ఎక్కి, వేగంగా పరిగెడుతూ అక్కడ ఉన్న ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేశాడు. ఇప్పుడా కుర్రాడు చేసిన ఘనకార్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే సూపర్ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు పైకెక్కి పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువకుడు వీరంగం వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వేస్టేషన్లో చోటుచేసుకొంది. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3.25 గంటల సమయంలో ప్రయాణికులతో నిండిన రైలు సోంపేట స్టేషన్కు చేరుకుంది. అప్పటికే ఫ్లాట్ఫారంపై సాధారణ రద్దీ ఉండగా.. పశ్చిమబెంగాల్కు చెందిన బిజయ్ సర్కార్ అనే యువకుడు ఆకస్మాత్తుగా రైలు పై భాగానికి ఎక్కాడు. అతను రైలు బోగీల పై భాగంలో అటూ ఇటూ పరుగులు తీయడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. ఏం జరుగుతుందో అర్ధం కాక కొందరు ప్రయాణికులు కిటికిల్లో నుంచి బయటకు చూస్తూ ఆందోలన వ్యక్తం చేశారు.
యువకుడు సమారు 20 నిమిషాల పాటు రైలు పై భాగంలోనే తిరుగుతూ వీరంగం సృష్టించాడు. ఈ పరిణామంతో రైలును అక్కడే నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో రైలు అరగంట పాటు కదలకుండా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ..ఎలాంటి ప్రమాదం జరగకుండా యువకుడిని కిందికి దించి అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో బిజయ్ సర్కార్ మతిస్థిమితం సరిగా లేని వ్యక్తిగి పోలీసులు గుర్తించారు. అనంతరం అతన్ని విచారణ నిమిత్తం చికిత్స కోసం పంపిచారు. ఈ ఘటనతో ఆలస్యం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అంతేకాకుడా.. దీంతో స్టేషన్లో ఉన్న ఇతర రైళ్ల కదలికలపై కూడా ప్రభావం పడింది.
రైలు పైకెక్కి యువకుడి వీరంగం
భువనేశ్వర్ నుంచి తిరుపతి వెళ్లే సూపర్ఫాస్ట్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు పైకెక్కి పశ్చిమబెంగాల్కు చెందిన ఓ యువకుడు వీరంగం వేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వేస్టేషన్లో చోటుచేసుకొంది. ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటల సమయంలో రైలు ప్రయాణికులతో సోంపేట… pic.twitter.com/kUNK5Q6MWf
— ChotaNews App (@ChotaNewsApp) January 5, 2026