E-Paper
Advertisement

Food Poisoning for Students: నంద్యాలలోని ఓ స్కూల్‌లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning for Students: నంద్యాలలోని ఓ స్కూల్‌లో పుడ్ పాయిజన్.. 100 మంది విద్యార్థులకు అస్వస్థత
Advertisement

Food Poisoning in School at Nandyal(Local news andhra Pradesh): నంద్యాల జిల్లాలో ఓ ప్రైవేటు విద్యా సంస్థలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. దీంతో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చైర్మన్‌ కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆహారం తిన్న విద్యార్థులకు వాంతులు చేసుకుని ఇబ్బంది పడ్డారు.

విషయం బయటకు రాకుండా విద్యాసంస్థ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంది. వైద్యులను ఘటన జరిగిన చోటకు తీసుకొచ్చి చికిత్స అందించినట్లు తెలుస్తోంది. అయితే ఫుడ్ పాయిజన్ అయిన విషయం కనీసం విద్యార్ధుల తల్లి దండ్రులకు స్కూల్ యాజమాన్యం సమాచారం అందించలేదు. ఎవరికి తెలియకుండ సీక్రెట్ గా పిల్లలకు ట్రీట్మెంట్ అందించినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న విద్యార్ధులు తల్లి దండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఇంత జరిగిన మాకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని స్కూల్ యాజమాన్యంపై తల్లి దండ్రులు మండి పడ్డారు. ఈ విద్యా సంస్థ వైసీపీకి చెందిన నాయకులదిగా గుర్తించారు.

Advertisement

Also Read: ఎస్సీ వర్గీకరణ వెనుక మాజీ సీఎంల కుట్ర ?

విద్యార్థులకు అస్వస్థత విషయం తెలుసుకున్న మంత్రి ఫరూక్‌ సీరియస్‌ అయిన్నట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో, డిప్యూట డీఈఓ పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. వాంతులపై విచారణ చేపట్టిన్నట్లు డీఈవో చెప్పారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×