BigTV English
Advertisement

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka: “కాంగ్రెస్ అంటేనే కరెంట్” పరిగిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యలు

Bhatti Vikramarka:  “కాంగ్రెస్ అంటేనే కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్” అని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదన్న వారు ఇప్పుడు ముట్టుకుంటే తెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. బుధవారం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను (గృహ జ్యోతి) అందిస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రతినెలా ₹2830 కోట్లను విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని తెలిపారు.


పరిగి నియోజకవర్గానికి ₹1000 కోట్లతో విద్యుత్ అభివృద్ధి పనులు మంజూరు చేశామని భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందులో భాగంగా 9 కొత్త సబ్ స్టేషన్లతో పాటు 400kv, 220kv సబ్ స్టేషన్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృషి వల్లే ₹3000 కోట్ల నావెల్ ప్రాజెక్టు, డిఫెన్స్ పరిశ్రమల ఏర్పాటు సాధ్యమైందని, వీటిని గత ప్రభుత్వం పదేళ్ల పాటు పట్టించుకోలేదని విమర్శించారు. మన్నెగూడ-బీజాపూర్ నాలుగు లైన్ల రహదారికి ఎన్జీటీ అడ్డంకులను తమ ప్రభుత్వమే తొలగించిందని గుర్తుచేశారు.

గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను (ప్రతి నియోజకవర్గానికి 3500, ఇంటికి ₹5 లక్షలు) నిర్మిస్తోందని, ఈ విషయంపై ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నానని అన్నారు. బంగారు తెలంగాణ, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు.


తమ ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను కల్పించిందని, కొందరు అడ్డుకోవాలని చూసినా గ్రూప్ 1 నియామకాలను కోర్టుకు వెళ్లి పూర్తి చేశామని తెలిపారు. 93 లక్షల కుటుంబాలకు ₹10 లక్షల పరిమితితో రాజీవ్ ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 100 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను (ఒక్కోటి ₹200 కోట్లతో) మంజూరు చేశామని, అందులో ఒకటి పరిగికి కేటాయించామన్నారు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వారానికి మూడు రోజులు ‘ప్రజాబాట’ నిర్వహించబోతున్నామని, “తెలంగాణ రైజింగ్”ను ఏ ప్రతిపక్షం ఆపలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

 

Related News

Deputy CM Bhatti: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు ఆలోచనలో ప్రభుత్వం: డిప్యూటీ సీఎం భట్టి

Jubilee hills elections: జూబ్లీహిల్స్ అభివృద్ధి బాధ్యత మాది: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Jubilee Hills bypoll: కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండు.. చలో ఏదో ఒకటి తేల్చుకుందాం: సీఎం రేవంత్ రెడ్డి

Nagarkurnool: కల్వకుర్తిలో దారుణం.. వివాహేతర సంబంధం నెపంతో ఒకే కుటుంబంపై వేట కొడవళ్లతో దాడి

CM Revanth Reddy: జూబ్లీలో మోదీ, కేసీఆర్ ఓవైపు.. రాహుల్ గాంధీ నేను ఓవైపు.. ఇక తాడోపేడో తేల్చుకుందాం: సీఎం రేవంత్

Jubilee Hills Bypoll: నవంబర్ సెంటిమెంట్.. బైపోల్స్‌లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా!

Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్‌.. బీఆర్ఎస్‌కు కవిత గండం

Big Stories

×