E-Paper
Advertisement

2 crore cash seized: వామ్మో నోట్ల కట్టలు, అనంతపురంలో భారీ ఎత్తున..

2 crore cash seized: వామ్మో నోట్ల కట్టలు, అనంతపురంలో భారీ ఎత్తున..
Advertisement

2 crore cash seized in AP(Andhra news today): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న‌కొద్దీ నగదు, నగలు పంపిణీ తీవ్రమవుతోంది. పోలింగ్‌కు కేవలం 13 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే నుంచే నేతలు.. నగలు, నగదు పంపిణీలు మొదలుపెట్టేశారు వివిధ పార్టీల నేతలు. దీంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్నికల సంఘం నియమించిన ప్లయింగ్ స్క్వాడ్ లు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి.

తాజాగా అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున నగదు పట్టబడింది. దాదాపు రెండు కోట్ల రూపాయలను ప్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. పోలీసుల తనిఖీల్లో భాగంగా అనంతపురం టౌన్ నుంచి కదిరి వైపు వెళ్తున్న పార్చునర్ వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. అందులో రెండు బ్యాగుల్లో తరలిస్తున్న కోటి 99 లక్షల 97, 500 రూపాయలను సీజ్ చేశారు. వాహనం రికార్డులను పరిశీలించగా కదిరి టీడీపీ అభ్యర్థి కందికుంట వెంటక ప్రసాద్ పేరున ఉంది.

Advertisement

డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పట్టుబడిన నగదును ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పోలీసులు అప్పగించారు. అనంతపురం ఒకేసారి ఈ రేంజ్‌లో నగదు పట్టుబడడం ఇదే తొలిసారి అంటున్నారు. దీంతో జిల్లాలో పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. అనుమానం వచ్చిన రాజకీయ పార్టీల కార్యకర్తల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×