Big Stories

Tamilnadu Bus Accident : లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి, 45 మందికి గాయాలు

Bus Falls into Deep Gorge in Tamilnadu : తమిళనాడులోని సేలంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో.. నలుగురు ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో 45 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఏర్కాడ్ నుంచి సేలం కు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు.. అదుపుతప్పి కొండ పై నుంచి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

- Advertisement -

సహాయక బృందాలు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సేలం ఎస్పీ అరుణ్ కబిలన్, ఎమ్మెల్యే ఆర్ రాజేంద్రన్ ఘటనా ప్రాంతాన్ని, సహాయక చర్యలను పర్యవేక్షించారు.

- Advertisement -

Also Read : ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, 23 మందికి గాయాలు

ఈ ప్రమాదంపై కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News