BigTV English
Advertisement

Anantapur News: మైనర్‌ని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు.. ఎక్కడ, ఏం జరిగింది?

Anantapur News: మైనర్‌ని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వృద్ధుడు.. ఎక్కడ, ఏం జరిగింది?

Anantapur News: అనంతపురం జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికను అరవై ఏళ్ల వృద్ధుడు బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అతడి నుంచి తప్పించుకున్న ఆ బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో అసలు యవ్వారం బయటపడింది. ఈ ఘటన రాయదుర్గంలో చోటు చేసుకుంది. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..


రాయదుర్గం నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఫ్యామిలీ రోజువారీ కూలి పనులపై ఆధారపడి జీవిస్తోంది. ఆ ఇంటికి యజమానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి చేశాడు. అయితే భర్త మరణించడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. రెండో కూతురికి 16 ఏళ్లు.

బాలిక ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాడు గుమ్మఘట్ట మండలంలోని పూలకుంట గ్రామానికి చెందిన 60 ఏళ్ల రామాంజనేయులు. ఎలాగైనా బాలికను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకు బాగానే జరిగింది. రామాంజనేయులకు రెండేళ్ల కిందట భార్య మరణించింది. ఓ కొడుక్కి పెళ్లి చేశాడు. పెళ్లికి సిద్ధంగా కూతురు ఉంది. కూతురుకి పెళ్లి చేసి పంపిస్తే తన బతుకు ఏంటని ఆలోచించాడు.


తనకు తోడుగా ఉండేందుకు యువతిని పెళ్లి చేసుకోవాలని భావించాడు. మైనర్ బాలిక విషయం తెలిసింది. ఏప్రిల్‌లో బాలిక ఇంటికి వెళ్లాడు రామాంజనేయులు. మీ అమ్మాయిని తనకు ఇచ్చి పెళ్లి చేయాలని యువతి తల్లిదండ్రులను కోరాడు. అందుకు వారు నిరాకరించాడు. ఆగ్రహంతో రెచ్చిపోయిన రామాంజనేయులు, వారిని బెదిరించాడు. ఇంటి బయట బాలిక మెడలో బలవంతంగా తాళి కట్టాడు.

ALSO READ: రాష్ట్ర పర్యటనకు షర్మిల శ్రీకారం.. చిత్తూరు నుంచి మొదలు

మరుసటి రోజు బాలికను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లాడు. దెబ్బలు భరించలేని బాలిక, రామాంజనేయులు ఇంటి నుంచి తప్పించుకుంది. మరింత రెచ్చిపోయిన రామాంజనేయులు ఈనెల 24న బంధువులతో కలిసి బాలిక ఇంటిపై దాడి చేశాడు. బాలిక తల్లి, తండ్రి, అక్కను చితకబాదారు. బాలికను బలవంతంగా ఓ వాహనంలో తీసుకెళ్లాడు. అనంతరం బాలికను ఒకచోట నిర్బంధించాడు.

శనివారం రాత్రి ఆ వృద్ధుడి చెర నుంచి తప్పించుకుంది మైనర్ బాలిక. అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ ఒకచోట సేద తీరింది. సోమవారం స్థానికుల సహాయంతో అనంతపురం ఎస్పీ ఆఫీసుకు చేరుకుంది. రామాంజనేయులు చేసిన వ్యవహారాన్ని బయటపెట్టింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు, రామాంజనేయులు దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతడు లేకపోవడంతో వెనుదిరిగారు.

Related News

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Big Stories

×