E-Paper
Advertisement

Train : రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి..ఎలా రక్షించారంటే..?

Train : రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కున్న యువతి..ఎలా రక్షించారంటే..?

Train : ఓ యువతి రైలు దిగే క్రమంలో అనూహ్యంగా ప్రమాదం బారిన పడింది. ఆ విద్యార్థి కళాశాలకు తొందరగా వెళ్లాలనే ఆతృతతో వేగంగా రైలు దిగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రైలుకు -ఫ్లాట్‌ఫామ్‌ మధ్య ఇరుక్కుపోయింది. దాదాపు గంటన్నరపాటు నరకయాతన అనుభవించింది. చాలాసేపు ఆమెను పైకిలాగేందుకు రైల్వేసిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు అతికష్టంమీద ఆమెను రక్షించారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్‌లో జరిగింది.

అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలోని ఓ కళాశాలలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కళాశాలకు వెళ్లేందుకు గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. ఆ రైలు దువ్వాడ స్టేషన్ కు చేరుకున్న సమయంలో ఆ యువతి ప్రమాదం బారిన పడింది. స్టేషన్‌లో రైలు దిగుతున్న క్రమంలో రైలు-ఫ్లాట్‌ఫామ్‌ మధ్యలో శశికళ ఇరుక్కుపోయింది. ఆమె కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో రైల్వే రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని యువతిని రక్షించేందుకు ప్రయత్నాలు చేశారు. ఆమె ఇరుక్కున్న చోట ఫ్లాట్‌ఫామ్‌ను కట్‌ చేశారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి శశికళను బయటకు తీశారు.

బాధితురాలు శశికళను వెంటనే చికిత్స కోసం కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. రైల్వే సిబ్బంది శ్రమతో ఆ యువతి ప్రాణాలు దక్కించుకుంది. ఈ ఘటనతో గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ గంటన్నర ఆలస్యంగా బయల్దేరింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×