Actor Mohan Babu: సినీ నటుడు మోహన్బాబుకు మళ్లీ కష్టాలు రెట్టింపు అయ్యాయా? ఆయన అరెస్టు తప్పదా? కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు న్యాయస్థానం నిరాకరించిందా? ఈ వ్యవహారంలో ఆయన సుప్రీంకోర్టుకి వెళ్తారా? లేకుంటే ఇక్కడే ఆగిపోతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
నటుడు మోహన్బాబుకు కష్టాలు.. హైకోర్టు బిగ్ షాక్
మోహన్బాబు యూనివర్సిటీ చాన్స్లర్, నటుడు మోహన్బాబుకు హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రధాన నిందితుడితో ఫోన్ కాల్స్, మెసేజ్లపై న్యాయస్థానం ఆరా తీసింది. అంతేకాదు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అసలేం జరిగింది?
తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీ విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తోందని ఆరోపిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు ఆరోపణలకు దిగాయి. ఈ క్రమంలో కలెక్టరేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. అదే సమయంలో ధర్నాకు బయల్దేరిన విద్యార్థి సంఘం నేతలు కిడ్నాప్ కావడం కలకలం రేపింది. దీంతో ఈ వ్యవహారం కాస్త ముదిరిపాకాన పడింది.
కిడ్నాప్ కేసులో ఆయన అరెస్టు ఖాయం?
భగ్గుమన్న మిగతా విద్యార్థి సంఘం నాయకులు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ ఆదేశాలతో రంగంలోకి దిగాయి ప్రత్యేక బృందాలు. చివరకు నారావారిపల్లి సమీపంలోని భీమవరం ఏరియాలో కిడ్నాపర్ల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. కిడ్నాపర్ల నుంచి విద్యార్థి సంఘం నేతలను విడిపించడం, ఆపై కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిడ్నాపర్లు అంతా మోహన్బాబు యూనివర్సిటీ బౌన్సర్లుగా గుర్తించిన పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల ఫిర్యాదుతో మోహన్బాబు మీద కేసు నమోదు చేశారు. పరిస్థితి గమనించిన మోహన్బాబు ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు హైకోర్టు తలుపుతట్టారు. ఆయనకు అక్కడా చుక్కెదురైంది.
ALSO READ: నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్న బాల్యం.. విద్యార్థులను రక్షించాలని నాగబాబు పిలుపు
విద్యార్థి సంఘాల నాయకుల కిడ్నాప్కు ముందు ఆ తర్వాత ప్రధాన నిందితుడు యూనివర్సిటీ పీఆర్వో ఫోన్లో మాట్లాడారని, మెసేజ్లు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నట్లు న్యాయస్థానం గుర్తుచేసింది. ఫోన్ కాల్స్తో పాటు మెసేజ్లను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు ఇలాంటి దశలో ఉన్నప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది.
అరెస్ట్తోపాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న మోహన్బాబు అభ్యర్ధనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అంతేకాదు అనుబంధ పిటిషన్ను కొట్టివేసింది. దీనిపై లోతైన విచారణ జరుపుతామని పేర్కొంది. క్వాష్ పిటిషన్పై విచారణను మార్చి మూడుకి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు.
సినీనటుడు మోహన్బాబుకు హైకోర్టులో చుక్కేదురు
కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి రక్షణకు నిరాకరణ
ప్రధాన నిందితుడితో ఫోన్ కాల్స్, మెసేజ్లపై కోర్టు ఆరా
ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక సమర్పించాలని ఆదేశం
క్వాష్ పిటిషన్ విచారణ మార్చి 3కు వాయిదా.
ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలకు గ్రీన్… pic.twitter.com/uxWewAed8V
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2026