Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఇతరులపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు రూపకల్పనలో దాదాపు రూ.2వేల 500 కోట్ల భారీ కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అలైన్మెంట్ను మార్చారని ఆయన ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి.. ముఖ్యంగా లింగమనేని గ్రూపునకు చెందిన భూముల విలువ పెంచేలా ఈ మార్పులు చేశారని ఆయన పేర్కొన్నారు.
ఈ అలైన్మెంట్ మార్పుకు ప్రతిఫలంగా లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఆర్కే విమర్శించారు. అలైన్మెంట్ మార్చినందుకు బదులుగా లింగమనేని కుటుంబం హెరిటేజ్ సంస్థకు భూములను కేటాయించిందని ఆరోపించారు. అత్యంత విలువైన కరకట్టపై ఉన్న ఇంటిని చంద్రబాబుకు లింగమనేని ఉచితంగా ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కేవలం రూ. 8 లక్షలకే పవన్ కళ్యాణ్కు అమ్మడం వెనుక కూడా అంతరార్థం ఉందని ఆయన ఆరోపించారు.
ఈ కేసులో చంద్రబాబు, లోకేశ్, మంత్రి నారాయణ , లింగమనేని రమేశ్లకు శిక్ష తప్పదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలతో సహా ఈ అవినీతిని నిరూపిస్తామని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read: రన్వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!
చంద్రబాబు, లింగమనేని రమేశ్, నారాయణ, లోకేశ్లకు శిక్ష తప్పదు: ఆళ్ల రామకృష్ణారెడ్డి
పక్కా ప్లాన్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డులో అవినీతి చేశారు
కోట్ల విలువ చేసే భూమిని రూ.8 లక్షలకు అమ్మారు
పవన్ కళ్యాణ్ కు కూడా రెండున్నర ఎకరాల భూమిని కేవలం రూ.8 లక్షలకే అమ్మారు
అత్యంత విలువైన… pic.twitter.com/zMDS8Ui4Hg
— BIG TV Breaking News (@bigtvtelugu) February 25, 2026