E-Paper
Advertisement

Ramakrishna Reddy: 2500 కోట్ల అవినీతి.. చంద్రబాబు, పవన్‌పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు!

Ramakrishna Reddy: 2500 కోట్ల అవినీతి.. చంద్రబాబు, పవన్‌పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Ramakrishna Reddy: మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ (IRR) వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ఇతరులపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు రూపకల్పనలో దాదాపు రూ.2వేల 500 కోట్ల భారీ కుంభకోణం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అలైన్‌మెంట్‌ను మార్చారని ఆయన ఆరోపించారు. తమకు కావాల్సిన వారికి.. ముఖ్యంగా లింగమనేని గ్రూపునకు చెందిన భూముల విలువ పెంచేలా ఈ మార్పులు చేశారని ఆయన పేర్కొన్నారు.

Advertisement

ఈ అలైన్‌మెంట్ మార్పుకు ప్రతిఫలంగా లింగమనేని రమేశ్ నుంచి చంద్రబాబు కుటుంబానికి లబ్ధి చేకూరిందని ఆర్కే విమర్శించారు. అలైన్‌మెంట్ మార్చినందుకు బదులుగా లింగమనేని కుటుంబం హెరిటేజ్ సంస్థకు భూములను కేటాయించిందని ఆరోపించారు. అత్యంత విలువైన కరకట్టపై ఉన్న ఇంటిని చంద్రబాబుకు లింగమనేని ఉచితంగా ఇచ్చారని ఆయన ధ్వజమెత్తారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కేవలం రూ. 8 లక్షలకే పవన్ కళ్యాణ్‌కు అమ్మడం వెనుక కూడా అంతరార్థం ఉందని ఆయన ఆరోపించారు.

ఈ కేసులో చంద్రబాబు, లోకేశ్, మంత్రి నారాయణ , లింగమనేని రమేశ్‌లకు శిక్ష తప్పదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలతో సహా ఈ అవినీతిని నిరూపిస్తామని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×