E-Paper
Advertisement

IndiGo Airlines: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!

IndiGo Airlines: రన్‌వేపై నిలిచిన విమానం.. లోపల ఊపిరాడక ప్రయాణికుల విలవిల!
Advertisement

IndiGo Airlines: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యం కావడమే కాకుండా.. ప్రయాణికులను విమానం లోపలే ఉంచడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

చెన్నై నుంచి సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E 51) సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే.. విమానం త్వరలోనే బయలుదేరుతుందని భావించిన సిబ్బంది.. సుమారు 200 మంది ప్రయాణికులను బోర్డింగ్ పూర్తి చేసి విమానం లోపలికి పంపారు. కానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో వారు ఏకంగా 5 గంటల పాటు విమానంలోనే బందీలుగా ఉండిపోయారు.

Advertisement

సాధారణంగా చెన్నై నుంచి సింగపూర్ ప్రయాణానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కానీ.. అంతకంటే ఎక్కువ సమయం విమానం కదలకుండా రన్‌వే పైనే ఉండటంతో ప్రయాణికులు సహనం కోల్పోయారు.

విమానంలో గాలి సరిగ్గా ఆడకపోవడం, సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి విషమించడంతో ప్రయాణికులు విమాన సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమను కిందకు దించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు ప్రయాణికులు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఇండిగో ఎయిర్‌లైన్ తీరుపై మండిపడుతున్నారు. సాంకేతిక లోపం ఉంటే ప్రయాణికులను టెర్మినల్‌లో ఉంచాలి కానీ ఇలా విమానంలో నిర్బంధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎయిర్‌లైన్స్ కనీస మర్యాదలు పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి విలాసాలపై హరీష్ రావు సెటైర్లు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×