E-Paper
Advertisement

RTC Bus Theft: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. కనురెప్ప పాటులో 15 తులాల బంగారం మాయం

RTC Bus Theft: ఆర్టీసీ బస్సులో భారీ చోరీ.. కనురెప్ప పాటులో 15 తులాల బంగారం మాయం
Advertisement

RTC Bus Theft: జిల్లాలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. కనురెప్ప పాటులో ఆమె బ్యాగ్‌లో ఉన్న సుమారు 15 తులాల బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. అనంతపురం నుంచి కదిరికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది.

అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం గ్రామానికి చెందిన శబనా అనే మహిళ తన పని నిమిత్తం అనంతపురం వచ్చారు. పని ముగించుకుని తిరిగి కదిరికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కారు. ఆమె తన వెంట దాదాపు 15 తులాల విలువైన బంగారు ఆభరణాలను బ్యాగులో భద్రపరుచుకున్నారు. బస్సు ప్రయాణంలో ఉండగా కండక్టర్ టికెట్ అడిగారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో, ఆధార్ కార్డు చూపించేందుకు శబనా తన బ్యాగును తెరిచారు.

Advertisement

బ్యాగ్ తెరిచి చూడగా లోపల ఉండాల్సిన బంగారు ఆభరణాలు కనిపించకపోవడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆందోళనతో వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు అనంతపురం కలెక్టరేట్ సమీపంలో బస్సును నిలిపివేసి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులందరి బ్యాగులను, లగేజీని జల్లెడ పట్టారు. ఎంత వెతికినా బంగారు ఆభరణాలు మాత్రం దొరకలేదు.

బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని దొంగలు చేతివాటం ప్రదర్శించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బస్సులో నగలు లభ్యం కాకపోవడంతో వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు బస్సును కదిరికి పంపించేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Read Also: Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌ చాలా సేఫ్, ఎవరూ కనిపెట్టలేరని అనుకుంటున్నారా? వాస్తవం ఇదీ!

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×