E-Paper
Advertisement

Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్ధృతం.. ఎమ్మెల్యే‌ల ఇళ్ల ముట్టడికి యత్నం..

Andhra Pradesh: ఆంధ్ర‌ప్రదేశ్‌లో అంగన్వాడీల పోరు ఉధృతంగా సాగుతుంది. ఏపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని జగన్‌ సర్కార్‌ తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్ల ను ముట్టడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం ఎమ్మెల్యేల ఇంటి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది.

Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తల సమ్మె ఉద్ధృతం.. ఎమ్మెల్యే‌ల ఇళ్ల ముట్టడికి యత్నం..
Advertisement

Andhra Pradesh: ఆంధ్ర‌ప్రదేశ్‌లో అంగన్వాడీల పోరు ఉధృతంగా సాగుతుంది. ఏపీలో నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీ సంఘాలు తమ పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇప్పట్లో వేతనాలు పెంచేది లేదని జగన్‌ సర్కార్‌ తేల్చి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కార్యాలయాలు, ఇళ్లను ముట్టడిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం ఎమ్మెల్యేల ఇంటి వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి.. నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

ఆందోళనల్లో భాగంగా ఏలూరులో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని ఇంటి వద్ద పోలీసులకు అంగన్‌వాడీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు.

నెల్లూరు జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి వరకు ర్యాలీ‌గా వెళ్లారు. తర్వాత మంత్రి ఇంటి ముందు నిరసన చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ఇంటిని ముట్టడించడాని అంగన్వాడీ కార్యకర్తలు ఆమె నివాసం వైపు వెళ్తుడంగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Advertisement

తూర్పుగోదావరి జిల్లాలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఇంటిని ముట్టడించి తమ డిమాండ్ లు తీర్చాలని నినాదాలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అంగన్వాడీలు ఎమ్మెల్యే ఉదయభాను ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వెంటనే వారిని నిలువరించారు. ఈ సందర్భంలో పోలీసులుకి అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళ సృహ తప్పి పడిపోయింది. బాపట్ల ఎమ్మల్యే కోన రఘపతి ఇంటి ముట్టడికి అంగన్వాడీలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోలీసులు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×