E-Paper
Advertisement

Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..

Tirumala latest news : మరో చిరుత బోనులో చిక్కింది.. జూకు తరలింపు..
Advertisement
Another cheetah caught in tirumala

Another cheetah caught in tirumala(Andhra Pradesh today news):

తిరుమల నడకదారిలో ఫారెస్ట్‌ అధికారుల చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. చిరుత పులులు ఒక్కొక్కటిగా బోనులో చిక్కుతున్నాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. ఈ విషయాన్ని అటవీశాఖ, టీటీడీ అధికారులు వెల్లడించారు. అలిపిరి కాలినడక మార్గంలో ఇటీవల 6 ఏళ్ల బాలికపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత ప్రాణాలు కోల్పోయింది. నెలన్నర ముందు ఓ బాలుడిని చిరుత అడవిలోకి లాక్కెళ్లింది. అదృష్టవశాత్తు ఆ బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

బాలికపై చిరుత దాడి ఘటన తర్వాత అటవీశాఖ సిబ్బంది, టీటీడీ అధికారులు చిరుతలను బంధించే చర్యలు చేపట్టారు. కాలినడక మార్గంలో 3 చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మోకాలిమిట్ట, 35వ మలుపు వద్ద బోన్లు అమర్చారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఓ చిరుత బోనులోకి వచ్చి చిక్కింది. తాజాగా గురువారం తెల్లవారుజామున మరో చిరుత చిక్కింది. ఈ చిరుతను కూడా జూకు తరలించి అబ్జర్వేషన్‌ లో ఉంచారు. 50 రోజుల వ్యవధిలో మొత్తం 3 చిరుతలను బంధించారు.

Related News

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

Big Stories

Advertisement
×