E-Paper
Advertisement

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను.. దంచికొట్టనున్న వర్షాలు!

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను.. దంచికొట్టనున్న వర్షాలు!
Advertisement

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తుఫానుకు డిత్వా తుఫానుగా పేరు పెట్టారు. నవంబర్ 28 నుంచి 29 తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను ప్రభావంతో.. భారీ వర్షాలు కురిసే అవకాశం
తుఫాను ప్రభావంతో.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. అలాగే కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో భిన్న వాతావరణం..
మరోవైపు తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర చలి.. అలాగే వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు చంద్రబాబు భూమి పూజ

తీరప్రాంత ప్రజలకు అలెర్ట్..
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని చెప్పారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే బయటకు రాకూడదని హెచ్చరించారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×