E-Paper
Advertisement

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను.. దంచికొట్టనున్న వర్షాలు!

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ముంచుకొస్తున్న డిత్వా తుఫాను.. దంచికొట్టనున్న వర్షాలు!
Advertisement

Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తుఫానుకు డిత్వా తుఫానుగా పేరు పెట్టారు. నవంబర్ 28 నుంచి 29 తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాను ప్రభావంతో.. భారీ వర్షాలు కురిసే అవకాశం
తుఫాను ప్రభావంతో.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. అలాగే కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

తెలంగాణలో భిన్న వాతావరణం..
మరోవైపు తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌, జగిత్యాల, మెదక్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో తీవ్ర చలి.. అలాగే వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Also Read: అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు చంద్రబాబు భూమి పూజ

తీరప్రాంత ప్రజలకు అలెర్ట్..
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని చెప్పారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే బయటకు రాకూడదని హెచ్చరించారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×