Cyclone Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడటంతో మరో తుఫాను ముంచుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ తుఫానుకు డిత్వా తుఫానుగా పేరు పెట్టారు. నవంబర్ 28 నుంచి 29 తేదీల మధ్య ఈ తుఫాను తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని.. ఈ కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను ప్రభావంతో.. భారీ వర్షాలు కురిసే అవకాశం
తుఫాను ప్రభావంతో.. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకూ తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లొద్దని సూచించారు. తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఏపీలో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
ఏపీలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు తెలిపారు. అలాగే కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, సత్యసాయి, నంద్యాల బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో భిన్న వాతావరణం..
మరోవైపు తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తోంది. అతి వర్షాలు, అతి చలి, అతి వేడి పరిస్థితులు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, కుమురంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, నిర్మల్, మహబూబ్నగర్ జిల్లాల్లో తీవ్ర చలి.. అలాగే వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: అమరావతిలో శ్రీవారి ఆలయ విస్తరణ పనులకు చంద్రబాబు భూమి పూజ
తీరప్రాంత ప్రజలకు అలెర్ట్..
తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు అధికారులు.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని చెప్పారు. అలాగే తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే బయటకు రాకూడదని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం
రెండు రోజుల్లో వాయుగుండంగా మారనున్నట్లు అంచనా
పుదుచ్చేరి వద్ద తీరం దాటనున్న వాయుగుండం
తెలంగాణపై అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం
అల్పపీడనం కారణంగా ఈ నెల 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో వర్షాలు pic.twitter.com/QxlPmpMqEQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2025