E-Paper
Advertisement

Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా

Delhi Blast Case Update: ఢిల్లీ బ్లాస్ట్ కేసు, వాళ్లిద్దరు భార్యాభర్తలే, ఆపై నిధులు సేకరణ కూడా
Advertisement

Delhi Blast Case Update:  ఢిల్లీ బ్లాస్ట్ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది? లోతుకి వెళ్లిన కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? నిందితుడు ముజమ్మిల్ కీలక విషయాలు బయటపెట్టాడా? పేలుడు పదార్థాలు కొనుగోలు డబ్బులు ఇచ్చిందెవరు? వీళ్లకి ఏయే ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి? వాటిలో లోతుగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.

ఢిల్లీ బ్లాస్ట్ కేసులో కొత్త కోణం

Advertisement

ఢిల్లీ పేలుడు కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎన్ఐఏ విచారణలో టెర్రర్ మాడ్యూల్ నిందితుడు ముజమ్మిల్ షకీల్ కీలక విషయాలు బయటపెట్టాడు. నిందితురాలు డాక్టర్‌ షాహిన్‌ షహిద్‌ గాళ్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని చెప్పాడట. మా ఇద్దరికి రెండేళ్ల కిందట నిఖా జరిగిందని తేల్చి చెప్పినట్టు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి.

అల్‌-ఫలా యూనివర్సిటీ సమీపంలో మతపరమైన ప్రదేశం వేదికైందంటూ జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. 2023లో ఆయుధాలు కొనుగోలుకు ముజమ్మిల్‌కు రూ.6.5 లక్షలు ఇచ్చిందని డాక్టర్‌ షాహిన్‌ ఇచ్చినట్టు గుర్తించారు. గతేడాది బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాహనం కొనుగోలుకు మూడు లక్షలు ఇచ్చినట్లు తేలింది.

Advertisement

ముజమ్మిల్-షాహిన్‌ వాళ్లిద్దరు భార్యాభర్తలు

ఈ నేపథ్యంలో ముజమ్మిల్-షాహిన్‌ మధ్య రిలేషన్ వెలుగులోకి వచ్చింది. డాక్టర్ షాహిన్‌‌కు జైషే మహమ్మద్ సంస్థతో సంబంధాలు ఉన్నాయా? లేవా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  పలు విడతలుగా   ఆయుధాలు-పేలుడు పదార్థాలు సమీకరించుకునేందుకు దాదాపు పాతిక లక్షలు డాక్టర్ షాహిన్ ఇచ్చినట్లు సమాచారం.

ఈ నిధులను మతపరమైన విరాళాలు కోసం ఇచ్చినట్లు ఆమె విచారణాధికారులతో చెప్పిందని తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి వివిధ రాష్ట్రాలలో దర్యాప్తు చేస్తున్నారు NIA అధికారులు. 2016 నుండి బారాముల్లా, శ్రీనగర్, అనంత్‌నాగ్, గండర్‌బాల్‌ల్లో యాక్టివ్ గా పని చేస్తున్న ఈ మాడ్యూల్స్, పాకిస్తాన్‌కు చెందిన హ్యాండ్లర్ల సూచనల మేరకు పని చేస్తున్నట్లు భావిస్తున్నారు.

ALSO READ:  రెండు కోట్ల ఆధార్ నెంబర్లు తొలగింపు, మరో విడత తొలగింపు?

డాక్టర్ షాహిన్‌.. జైష్-ఎ-మొహమ్మద్ గ్రూపులో మహిళా విభాగంలో కీలక పాత్ర పోషిస్తోందని తేలింది. ఆ గ్రూపు మహిళా బ్రిగేడ్‌ల ఏర్పాటుకు ఆన్‌లైన్‌ కోర్సులు ప్రారంభించినట్లు సమాచారం. పాక్‌‌లో ఉగ్రవాదుల నుంచి అందుతున్న ఆదేశాలతో భారత్‌లో మహిళా విభాగాలు స్థాపించారని అంటున్నాయి దర్యాప్తు బృందాలు. ఇక ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఇప్పటివరకు ఏడుగుర్ని అరెస్టు చేసింది ఎన్ఐఏ.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×