BigTV English

Viveka Murder Case : ఆ వాంగ్మూలం తప్పు.. హైకోర్టులో ఏపీ సీఎం ప్రధాన సలహాదారు పిటిషన్..

Viveka Murder Case : ఆ వాంగ్మూలం తప్పు.. హైకోర్టులో ఏపీ సీఎం ప్రధాన సలహాదారు పిటిషన్..

Viveka Murder Case : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. జూన్ 30న సీబీఐ తెలంగాణ హైకోర్టుకు సమర్పించిన వాంగ్మూలంపై ఏపీ సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం అభ్యంతరం తెలిపారు. సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా నమోదు చేసిందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.


సీబీఐ వాంగ్మూలంలో ఏముందంటే.. లోటస్‌పాండ్‌లో ఉండగా ఉదయం 5.30 గంటలకు అటెండర్‌ తలుపు కొట్టారని అజేయం కల్లాం తెలిపారని సీబీఐ పేర్కొంది. వైఎస్‌ భారతి మేడపైకి రమ్మంటున్నారని అటెండర్‌ జగన్‌కు చెప్పినట్లు పేర్కొన్నారు. బయటకు వెళ్లి 10 నిమిషాల తర్వాత జగన్‌ మళ్లీ వచ్చారని వివరించారు. బాబాయ్‌ ఇక లేరనే విషయాన్ని జగన్‌ నిలబడే చెప్పారంటూ అజేయ కల్లం వాంగ్మూలాన్ని సీబీఐ జూన్‌ 30న హైకోర్టుకు సమర్పించింది.

తన వాంగ్మూలాన్ని సీబీఐ తప్పుగా నమోదు చేసిందని పేర్కొంటూ.. తాజాగా అజేయ కల్లం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సీఎం జగన్‌ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదని స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఛార్జిషీట్‌ నుంచి తన వాంగ్మూలాన్ని తొలగించాలని కోరారు. తన వాంగ్మూలం విషయంలో మళ్లీ విచారణ జరిపేలా సీబీఐను ఆదేశించాలని పిటిషన్‌లో అజేయ కల్లం కోరారు.


Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×