BigTV English

AP Assembly Sessions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly Sessions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

AP Assembly Sessions Land Titling Act: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలకు దోహదం చేసిందన్నారు. ముఖ్యంగా భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారన్నారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వం నుంచి వస్తుందన్నారు.

ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ సీఎం ఫొటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని, ఎక్కడికక్కడ వివాదాలు పెంచేశారన్నారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు.


ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

Related News

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Jagan: జగన్ ఇరుక్కుపోయారా? ఫారెన్ టూర్‌ చిక్కులు.. రంగంలోకి సీబీఐ, ఇప్పుడెలా?

PM Modi: నేడు ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. మినిట్ టు మినిట్ షెడ్యూల్ ఇదే..

Tirumala: తిరుమల కొండపై సీఎంఓ పెత్తనమా? బదిలీ వెనుక కారణం ఇదేనా.!

AP Excise Suraksha App: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై నకిలీ మద్యానికి చెక్

Modi To Kurnool: ఏపీకి రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు.. కర్నూలు పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్

Big Stories

×