E-Paper
Advertisement

AP Assembly Sessions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం

AP Assembly Sessions: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైంది.. రద్దుకు అసెంబ్లీ ఆమోదం
Advertisement

AP Assembly Sessions Land Titling Act: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాట్లాడారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భయంకరమైందని సీఎం చంద్రబాబు అన్నారు. గత ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలకు దోహదం చేసిందన్నారు. ముఖ్యంగా భూ యజమానులకు చాలా సమస్యలు వచ్చాయన్నారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తే న్యాయవాదులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టారన్నారు. భూమి అనేది తరతరాలుగా వారసత్వం నుంచి వస్తుందన్నారు.

Advertisement

ప్రభుత్వం ముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ సీఎం ఫొటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు. ఇటీవల భూ సర్వే అన్నారని, ఎక్కడికక్కడ వివాదాలు పెంచేశారన్నారు. ఈ చట్టం వచ్చి ఉంటే పౌరుల ఆస్తి హక్కును మింగేసే పరిస్థితి తలెత్తేదని సీఎం వ్యాఖ్యానించారు.

ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు, హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దుపై రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లుపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చర్చను ప్రారంభించారు. అనంతరం రెండు బిల్లులు సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×