E-Paper
Advertisement

AP Cabinet: ఇవాళే ప్రమాణస్వీకారం.. ఏ క్షణమైనా మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం

AP Cabinet: ఇవాళే ప్రమాణస్వీకారం.. ఏ క్షణమైనా మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం
Advertisement

AP Cabinet list: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన కేంద్రమంత్రులకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు బాబుతో సమావేశమై.. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు అనేదానిపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు పూర్తయ్యిందని, ఏ క్షణంలోనైనా మంత్రుల జాబితాను చంద్రబాబు.. గవర్నర్ కు పంపనున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి చెప్పనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వాగతం పలికారు.

ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ తోపాటు పలువురు మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర రంగాలకు చెందిన ప్రముకులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Also Read: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు

అయితే, ఇప్పటికే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు రజినీకాంత్, మెగాస్టార్ చీరంజీవితోపాటు పలువురు ప్రముఖులు ఏపీకి చేరుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు.. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా రావాలంటూ తానే స్వయంగా ఫోన్ చేయగా, ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించిందని, ఈ నేపథ్యంలోనే జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×