E-Paper
Advertisement

AP Cabinet: ఇవాళే ప్రమాణస్వీకారం.. ఏ క్షణమైనా మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం

AP Cabinet: ఇవాళే ప్రమాణస్వీకారం.. ఏ క్షణమైనా మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం
Advertisement

AP Cabinet list: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన కేంద్రమంత్రులకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు బాబుతో సమావేశమై.. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు అనేదానిపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు పూర్తయ్యిందని, ఏ క్షణంలోనైనా మంత్రుల జాబితాను చంద్రబాబు.. గవర్నర్ కు పంపనున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి చెప్పనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వాగతం పలికారు.

ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ తోపాటు పలువురు మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర రంగాలకు చెందిన ప్రముకులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisement

Also Read: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు

అయితే, ఇప్పటికే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు రజినీకాంత్, మెగాస్టార్ చీరంజీవితోపాటు పలువురు ప్రముఖులు ఏపీకి చేరుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఇదిలా ఉంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు.. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా రావాలంటూ తానే స్వయంగా ఫోన్ చేయగా, ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించిందని, ఈ నేపథ్యంలోనే జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×