E-Paper
Advertisement

Chandrababu Called Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!

Chandrababu Called Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!

Chandrababu called to Former CM Jagan: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా పలువురు ప్రముఖులకు ఇప్పటికే చంద్రబాబు ఆహ్వానం పంపారు. ఇటు మాజీ సీఎం జగన్ కు చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి.. ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే, జగన్ తో మాట్లాడేందుకు చంద్రబాబు యత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాకూడదని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జగన్ అందుబాటులోకి రాలేదని సమాచారం.

కాగా, ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించింది. దాదాపు 175 వరకు సీట్లు వస్తాయని ఆశపడిన జగన్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఫలితాల తరువాత మీడియా ముందుకు వచ్చిన జగన్.. 11 సీట్లకే పరిమితం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉండాలని వైఎస్సార్ సీపీ నిర్ణయించినట్లు సమాచారం.

ఇటు ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తియినట్లు తెలుస్తోంది. కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.

Also Read: మన రాజధాని అమరావతి.. ఆర్థిక రాజధానిగా విశాఖ : చంద్రబాబు

వీఐపీలో కోసం నాలుగు ప్రత్యేక గ్యాలరీలు, ప్రజల కోసం ఒక గ్యాలరీని.. మొత్తం ఐదు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సుమారుగా 2 లక్షల మంది వరకు రావొచ్చంటూ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కార్యక్రమం జాతీయ రహదారి పక్కనే నిర్వహిస్తున్న తరుణంలో హైవేపై పలు ఆంక్షలు కూడా విధించారు.

ఇదిలా ఉంటే.. నేడు విజయవాడలోని ఏ కన్వెన్షన్ హాలులో కూటమి తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ముందుగా చంద్రబాబును సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా కూటమిలోని మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×