E-Paper
Advertisement

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు  Vs పోలీసులు
Advertisement

Fishermen Vs Police: అనకాపల్లి జిల్లా నక్కపల్లి హైవే దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బల్క్ డ్రగ్స్ పార్కు నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని మత్స్యకారులు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతంగా మారింది. రహదారికి ఇరువైపుల నిరసనకి దిగడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వాళ్లని వదిలిపెట్టాలని రామ చంద్ర యాదవ్ వచ్చేందుకు పోలీసులు అనుమతి అవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మత్స్యకారులతో చర్చించేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి వద్దకి  చేరుకుంటున్నారు.

అక్కడి నక్కపల్లి తహశీల్దార్ కార్యాలయం సమీపంలో.. ఆందోళనల తీవ్రత ఎక్కువయి, జిల్లా కలెక్టర్ విజయం కృష్ణన్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి నిర్ణయాలపై చర్చించే ప్రయత్నం చేయగా, మత్యకారులు కలెక్టర్ వచ్చే వరకు ఉద్యమాన్ని ఆపమని నిరాకరించారు. సుమారు 10 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement

మత్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్, సీపీఎం నాయకుడు అప్పలరాజును పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై నిరసనకారులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాయకుల రాకను అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని ఆరోపించారు. దీంతో ఆందోళన మరింత ఉధృతమైంది.

మత్యకారులు నక్కపల్లి ఎస్‌ఐ సన్నిబాబును వెంటనే సస్పెండ్ చేయాలని, హోం మంత్రి వంగలపూడి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

ఉద్రిక్తతతో జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డు రెండువైపులా లారీలు, బస్సులు, కార్లు నిలిచి ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించే ప్రయత్నం చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు.

 

Related News

ఏపీలో తీవ్ర విషాదం.. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

ఏపీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రిలీజ్.. 20 డిపార్ట్‌మెంట్లలో ఖాళీలు, ప్రస్తుతం ఆ శాఖలకు సంబంధించి

పులివెందులలో అర్ధరాత్రి ఏం జరిగింది? గణేషుడి మండపం వద్ద కాల్పులు, పరుగో పరుగు

రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన.. బంగాళాఖాతంలో ద్రోణి, ఏపీలో భారీ వర్షాలు

నెల్లూరులో చెత్త నిధులపై మాటల యుద్ధం.. సవాల్ విసిరిన వైసీపీ.. తిప్పికొట్టిన కూటమి!

పల్నాడులో విషాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రావెల్ బస్సు, ఇద్దరి మృతి!

చిటికెలో సమస్యలు పరిష్కారం, శ్రీవారి భక్తులకు తోడుగా ‘నందకం’

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. సోమవారం నుంచి సర్వ దర్శనం టోకెన్లు నిలిపివేత

Big Stories

Advertisement
×