E-Paper
Advertisement

Vijayawada Drone Show: అమరావతిలో భారీ డ్రోన్ షో.. ఏకంగా ఐదు గిన్నీస్ రికార్డులు

Vijayawada Drone Show: అమరావతిలో భారీ డ్రోన్ షో.. ఏకంగా ఐదు గిన్నీస్ రికార్డులు
Advertisement

మంగళవారం రాత్రి విజయవాడ గగనతలం.. డ్రోన్ల వెలుగులతో నిండిపోయింది. పున్నమిఘాట్‌లో నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన.. ప్రేక్షకులను అబ్బురపరిచింది. సుమారు 5500 డ్రోన్లతో దేశంలోనే తొలిసారిగా.. ఈ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ షోను ప్రజలంతా చూసేందుకు వీలుగా పున్నమీ ఘాట్‌లో 4 ప్రాంతాల్లో ఎల్‌ఈడీ డిస్‌ప్లేలను కూడా ఏర్పాటు చేశారు.

ప్రదర్శనలో భాగంగా.. ఆకాశంలో చిమ్మ చీకట్లో వేలాది డ్రోన్లు వివిధ ఆకారాల్లో అబ్బుర పరిచాయి. ముఖ్యంగా విమానం.. గ్లోబ్.. బుద్ధుడు.. తదితర ఆకారాలు వహ్వా అనిపించాయి. అందుకే.. రాత్రికి రాత్రే.. ఐదు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకుంది ఈ డ్రోన్ షో. ప్రదర్శన అనంతరం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆ ధ్రువపత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.

Advertisement

ఆ అద్భుతమైన డ్రోన్ షోను ఇక్కడ లైవ్‌లో చూడండి:

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×