E-Paper
Advertisement

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే
Advertisement

CM Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు యాక్టివ్ గా పొల్గొనడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఎమ్మెల్యేలపై సీరియస్

పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరాగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలన్నారు. పెన్షన్ల పంపిణీ తర్వాత కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని సీఎం ఆదేశించారు. సీన్సియర్‌గా పనిచేసిన కార్యకర్తలను కలుపుకెళ్లాలన్నారు.

Advertisement

Also Read: CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

ప్రతి శుక్రవారం ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం

నియోజకవర్గ టీడీపీ ఆఫీసుల్లో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొనకపోతే టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులు, నిధుల కొరతపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Related News

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

Big Stories

Advertisement
×