E-Paper
Advertisement

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

CM Chandrababu: టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. సీఎం చంద్రబాబు శనివారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. పెన్షన్ల పంపిణీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో 48 మంది ఎమ్మెల్యేలు యాక్టివ్ గా పొల్గొనడం లేదని సీఎం చంద్రబాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ 48 మంది ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించారు.

ఎమ్మెల్యేలపై సీరియస్

పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరాగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ కోరాలన్నారు. పెన్షన్ల పంపిణీ తర్వాత కార్యకర్తలు, ప్రజలతో ఎమ్మెల్యేలు మాట్లాడాలని దిశానిర్దేశం చేశారు. టీడీపీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేలు పాల్గొని తీరాల్సిందేనని సీఎం ఆదేశించారు. సీన్సియర్‌గా పనిచేసిన కార్యకర్తలను కలుపుకెళ్లాలన్నారు.

Also Read: CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

ప్రతి శుక్రవారం ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం

నియోజకవర్గ టీడీపీ ఆఫీసుల్లో ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో పాల్గొనకపోతే టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వివరణ తీసుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్యేల వ్యవహారాన్ని తన దృష్టికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితులు, నిధుల కొరతపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×