BigTV English
Advertisement

CM Jagan Delhi Tour: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన.. మోదీతో ఏపీ నిధులు, అభివృద్ధిపై చర్చ!

CM Jagan Delhi Tour: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన.. మోదీతో ఏపీ నిధులు, అభివృద్ధిపై చర్చ!
cm jagan latest news

CM Jagan Delhi Tour Today: సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనలో బిజీకానున్నారు. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు నిన్న హస్తినకు వెళ్లారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, వైఎస్సార్సీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.


శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. ఆ తర్వాత కేంద్రమంత్రులైన అమిత్‌షా, నిర్మలాసీతారామన్‌ కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Read More : ఏపీ విద్యార్థులకు ఇదే లాస్ట్.. నిలిచిపోనున్న ఉమ్మడి అడ్మిషన్లు..


పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందంటూ ప్రతిపక్షాలు ఎన్నికల వేళ దుమ్మెత్తిపోస్తుండటంతో.. త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం జగన్‌. ఈ మేరకు సత్వరమే కేంద్రం సహాయాన్ని కోరనున్నారు. అలాగే తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలు, విభజన సమయంలో ఇచ్చిన హామీలపై, పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానితో చర్చించనున్నారు ఏపీ సీఎం. అనంతరం అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌లను కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

ఇక ఏపీలో త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో పార్టీ అధినేతలు ఢిల్లీ బాటపట్టడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో పొత్తులపై చర్చలు జరిపారన్న టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ జనసేనతో మిత్ర బంధం కొనసాగిస్తున్నా.. టీడీపీతో మళ్లీ స్నేహగీతంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి తరుణంలో సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో పలు రకాల చర్చకు దారి తీసింది.

Related News

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Lokesh Praja Darbar: లోకేష్ ప్రజా దర్బార్.. పల్లా ఆసక్తికర వ్యాఖ్యలు..

Rain Alert: ఆవర్తనం ఎఫెక్ట్.. నేడు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్..

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Big Stories

×