E-Paper
Advertisement

AP Dairy Farmers: పాడి రైతులకు గుడ్ న్యూస్.. పశుగ్రాసం సాగుకు 100% రాయితీ.. దరఖాస్తు ఇలా!

AP Dairy Farmers: పాడి రైతులకు గుడ్ న్యూస్.. పశుగ్రాసం సాగుకు 100% రాయితీ.. దరఖాస్తు ఇలా!
Advertisement

AP Dairy Farmers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాడి రైతులకు అవసరమయ్యే పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 శాతం రాయితీతో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పశుగ్రాసం సాగుకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.

పశుగ్రాసం పథకం ముఖ్యాంశాలు

  • పశుగ్రాసం పెంపకానికి 100% రాయితీ
  • ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం సాగుకు అనుమతి
  • ఈ పథకం ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు కలిగిన రైతులకు మాత్రమే వర్తిస్తుంది.
  • ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు (5 ఎకరాల లోపు) ఈ పథకానికి అర్హులు
  • రైతులు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.
  • పశుగ్రాసం సాగుకు నీటి వసతి ఉన్న భూములను మాత్రమే ఎంపిక చేస్తారు.
  • రైతుల ఎంపిక విధానం ఇలా
  • రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రం లేదా పశువైద్యాధికారిని సంప్రదించి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  • గ్రామసభల ద్వారా ఈ పథకానికి అర్హులైన రైతులను ఎంపిక చేస్తారు.
  • అర్హులైన రైతులను ఎంపిక చేసి జాబితాను జిల్లా కలెక్టర్ ఆమోదం కోసం పంపిస్తారు.
  • అధికారుల పర్యవేక్షణలో పశుగ్రాసం సాగుకు అనుమతి ఇస్తారు.
  • పశుగ్రాసం సాగుతో ప్రయోజనాలు
  • పాడి రైతుల పశువులకు తగిన ఆహారం సులభంగా లభిస్తుంది.
  • గ్రామాల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది.
  • రైతుల ఆర్థిక స్థిరత్వానికి అవకాశం ఏర్పడుతుంది.
  • పశుగ్రాసం పెంపకం కోసం రైతులు దరఖాస్తుతో పాటు రేషన్‌కార్డు, ఆధార్‌ కార్డు, పొలం 1బి, ఉపాధి హామీ జాబ్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్స్‌లను అధికారులకు అందజేయాలి.

Also Read: Anantapur Land Grab: అనంతపురంలో అదుపులేని భూ కబ్జాలు.. అధికార పార్టీ నేతపై ఆరోపణలు

పాడి రైతులకు ప్రోత్సాహకాలు

  • 50 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ.15000, సామాగ్రి కోసం రూ.17,992 కలిపి మొత్తం రూ.32,992 ప్రభుత్వం అందిస్తుంది.
  • 40 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ. 12,000, సామాగ్రి కోసం రూ.14,394 కలిపి మొత్తం రూ.26,394 అందిస్తారు.
  • 30 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ.9 వేలు, సామాగ్రి కోసం రూ.10,795 కలిపి మొత్తం రూ.19,795 ఇస్తారు.
  • 20 సెంట్లలో కూలీల వేతనం కింద రూ.6 వేలు, సామాగ్రి కోసం రూ.7,197 కలిపి మొత్తం రూ.13,197 అందిస్తారు.
  • 10 సెంట్లలో కూలీల వేతనం కోసం రూ.3 వేలు, సామాగ్రి కోసం రూ.3,559 కలిపి మొత్తం రూ.6,559 రైతులకు అందిస్తారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×