Odisha Crime: ఒడిశా రాష్ట్రంలో దారుణ హత్య జరిగింది. బెర్హంపూర్ నగరంలో స్థానిక బీజేపీ లీడర్, సీనియర్ న్యాయవాది అయిన పితాబస్ పాండా సోమవారం రాత్రి దారుణంగా హత్యకు గురయ్యారు. బ్రహ్మనగర్ ఏరియాలోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.
ఒడిశా స్టేట్ బార్ కౌన్సిల్ లో సభ్యుడిగా కూడా ఉన్న పాండాపై ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి దాడి చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 10 గంటల సమయంలో దుండగులు ఆయనపై రెండు కాల్పులకు దిగారు. కాల్పులు జరిగిన వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు పాండాను సమీపంలోని ఎంకేసిజి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.
ALSO READ: TGPSC Group-1: టీజీపీఎస్సీకి గుడ్ న్యూస్.. గ్రూప్-1 నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
ఈ హత్య తర్వాత బెర్హంపూర్ నగరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీనియర్ పోలీస్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించడం ప్రారంభించారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడి వెనుక ఉన్నది ఎవరో..? తెలుసుకోవడానికి.. నిందితులను త్వరగా పట్టుకోవడానికి సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని పోలీసు అధికారులు అధికారులు తెలిపారు.
ALSO READ: Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?