E-Paper
Advertisement

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?
Advertisement

Amaravati: గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశమైంది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడుతున్న సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమావేశం నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. తీవ్ర వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం.

చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్

Advertisement

కొన్నాళ్లుగా  అనారోగ్య సమస్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వెంటాడుతున్నాయి. గురువారం అమరావతిలో చంద్రబాబు మంత్రి వర్గం సమావేశమైంది. సమావేశానికి ముందు నుంచి తీవ్రమైన వెన్నునొప్పితో ఆయన బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం. వివిధ అంశాలపై కేబినెట్‌లో చర్చిస్తుండగా నొప్పి మరింత తీవ్రమైనట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అసలు సమస్య చెప్పి కేబినెట్ మధ్యలో పవన్ కల్యాన్ వెళ్లినట్టు సమాచారం. ఉన్నట్లుండి మంత్రివర్గం భేటీ నుంచి డిప్యూటీ సీఎం పవన్ మధ్యలో వెళ్లిపోవడంపై అక్కడి ప్రభుత్వ వర్గాలు ఆరా తీశాయి. చివరకు తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా సచివాలయం నుంచి మంగళగిరి పార్టీ ఆఫీసుకు వెళ్ళారట.

Advertisement

వెన్నునొప్పి కారణంగా సచివాలయం నుంచి పార్టీ ఆఫీసుకు

నొప్పి తీవ్రమైతే ఆసుపత్రి వెళ్లే అవకాశముందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం తెలియగానే ఆ పార్టీ కార్యకర్తలు పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. తమ అభిమాన నేతలకు ఆరోగ్యం ఎలా ఉందంటూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల ఆపరేషన్ తర్వాత ఇప్పుడిప్పుడే పవన్ కల్యాణ్ యాక్టివ్ అవుతున్నారు. ఇంతలో వెన్ను నొప్పి వెంటాడడం మొదలు పెట్టింది.

ALSO READ:  తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ఆరు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు, రూ. 60 లక్షలు సీజ్

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×