E-Paper
Advertisement

karikal valaven resign: ఏపీలో రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్

karikal valaven resign: ఏపీలో రాజీనామాల పర్వం, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల రిజైన్
Advertisement

karikal valaven resign: ఆంధ్రప్రదేశ్‌ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన అధికారులను ఏమాత్రం సహించేది లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో ఒక్కసారి ఛాన్స్ ఇస్తే, మళ్లీ ఇదే కంటిన్యూ అవుతుందని ఓపెన్‌గా చెప్పేశారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో గుబులు మొదలైంది.

ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించు కోవాలనే దానిపై ఆలోచనలోపడ్డారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా ప్రభుత్వం అంగీకరించడం లేదు. లెక్కలు తేలిన తర్వాతే పంపించాలని నిర్ణయించింది. ముఖ్యంగా తిరుమల నుంచే ప్రక్షాళన చేపట్టారు సీఎం చంద్రబాబునాయుడు. టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వేటు వేసింది. కొత్తగా శ్యామలారావును నియమించింది.

Advertisement

దేవాదాయ శాఖలో అనేక అవతకవతలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ దేవాదాయ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్ తన పదవికి రాజీనామా చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత సర్వీసులో కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో నెలన్నర పదవీకాలం ఉండగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ALSO READ: వివాదంలో జగన్, ఫర్నీచర్‌పై శిక్షించాలన్న శివరామ్

Advertisement

గతంలో జగన్ ప్రభుత్వానికి ఆయన పూర్తిగా సహకరించారనే ఆరోపణలు కరికాల వలవన్‌పై ఉన్నాయి. అంతేకాదు దేవాదాయ శాఖలో అవినీతితోపాటు నిధులు దారి మళ్లినట్టు వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో కరికాల రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరి కొత్త ప్రభుత్వం ఆయన రాజీనామా ఓకే చేస్తుందా? లెక్కలు తేలిన తర్వాతే రాజీనామాను అంగీకరిస్తామని చెబుతుందా? అనేది చూడాలి. మొత్తానికి పదవీ విరమణ తర్వాత కొనసాగుతున్న అధికారులకు టెన్షన్ మొదలైంది. ఈ జాబితాలో ఇంకెంతమంది అధికారులు బయటకు వస్తారో చూడాలి.

Tags

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×