Free bus scheme: ఏపీలో మహిళల కోసం ప్రారంభించిన స్త్రీ శక్తి పథకంలో భాగంగా అమలు చేస్తున్న ఫ్రీ బస్ సౌకర్యం ఇప్పుడు కొత్త కొత్త విన్యాసాలకు వేదిక అవుతోంది. రోజువారీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు, ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలి అన్న షరతు తెలిసిందే. అయితే ఇప్పుడు టెక్నాలజీని వాడేసుకుని, మహిళలు కొత్త ట్రిక్ని కనిపెట్టేశారు. ఆధార్ కార్డు కాపీ చూపించకుండానే కేవలం ఫోన్ స్క్రీన్ చూపిస్తే సరిపోతుంది. దాంతో ఇప్పుడు చాలామంది మహిళలు తమ ఆధార్ కార్డు ఫోటోను మొబైల్ వాల్పేపర్గా సెట్ చేసుకుని బస్సుల్లో ఫ్రీ టికెట్ పొందుతున్నారు.
ఆధార్ చూపించకుండానే ఫ్రీ టికెట్
ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభమైన మొదటి రోజుల్లో బస్ కండక్టర్లు ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించాలని పట్టుబట్టారు. కానీ కొన్ని రోజుల తర్వాత రూల్స్ కాస్త సడలించడంతో, ఫోన్లో చూపించిన ఆధార్ స్కాన్ లేదా ఫోటో కూడా సరిపోతుందని అనుమతించారు. ఈ సౌకర్యాన్ని ఇప్పుడు మహిళలు స్మార్ట్ ఐడియాగా మార్చుకున్నారు. మొబైల్ లాక్ స్క్రీన్కే ఆధార్ కార్డు పెట్టేసుకుంటే, బస్ ఎక్కిన వెంటనే ఫోన్ చూపించి “జీరో టికెట్” సెట్ అయిపోతోంది.
మహిళల టెక్ క్రియేటివిటీకి RTC ఫిదా
ఈ ట్రెండ్ ఇప్పుడు ఏపీలో అంతటా వైరల్ అవుతోంది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఈ కొత్త ఐడియా చూసి ఆశ్చర్యపోతున్నారు. “చూసారా… మహిళల క్రియేటివిటీకి జవాబు లేదు” అంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఒక్కసారిగా ఫోన్ లాక్ తీసి చూపించడం వల్ల టైమ్ కూడా సేవ్ అవుతుందని చెబుతున్నారు ప్రయాణికులు.
వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు
సోషల్ మీడియాలో ఈ టెక్నాలజీ యూజ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బస్సుల్లో మొబైల్ చూపించి ఫ్రీగా ప్రయాణిస్తున్న మహిళల వీడియోలు, ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. “ఏమంటారు… మన స్త్రీ శక్తి స్కీమ్కి టెక్నాలజీ కలసి వచ్చేసింది” అంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు. కొంతమంది మహిళలు అయితే ఒక అడుగు ముందుకేసి, మొబైల్ గ్యాలరీలో ఆధార్ ఫోటోని లైవ్ వాల్పేపర్గా సెట్ చేసుకుని, కేవలం పవర్ బటన్ నొక్కి చూపించి సీట్లో కూర్చుంటున్నారు.
ట్రావెల్ సౌకర్యం మరింత సులభం
ఈ స్మార్ట్ ఐడియాతో ప్రయాణం చాలా ఈజీ అయిందని మహిళలు చెబుతున్నారు. ప్రతిసారీ హ్యాండ్బ్యాగ్లో నుంచి ఆధార్ తీయడం, క్యూలో నిలబడటం వంటి ఇబ్బందులు తొలగిపోయాయి. ఇప్పుడు బస్ ఎక్కగానే, “మొబైల్ చూపించు.. జీరో టికెట్ తీసుకో” అన్న ఫార్ములా అమలవుతోంది.
దీనిపై ప్రయాణికురాలు మాట్లాడుతూ, ప్రతిసారి ఆధార్ తీసి చూపించడం కష్టంగా అనిపించేది. ఇప్పుడు వాల్పేపర్గా సెట్ చేసుకున్న తర్వాత రెండు సెకన్లలో టికెట్ తీసేసుకుంటున్నా. టైమ్ కూడా సేవ్ అవుతుందన్నారు.
ఆర్టీసీ సిబ్బంది స్పందన
ఆర్టీసీ సిబ్బంది కూడా ఈ స్మార్ట్ యూజ్ను పాజిటివ్గా చూస్తున్నారు. మహిళలు ఫోన్లో ఆధార్ చూపించగానే స్కాన్ చేసి జీరో టికెట్ ఇస్తున్నాం. దీని వల్ల వాహనంలో గందరగోళం తగ్గింది. ప్రయాణ సమయం కూడా తగ్గుతోందని ఓ సీనియర్ కండక్టర్ తెలిపారు.
స్కీమ్కు మంచి రెస్పాన్స్
స్త్రీ శక్తి ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభమైన దగ్గరనుంచి, రోజుకు లక్షలాది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థినులు, ఉద్యోగినులు, రైతు కూలీలు సహా అన్ని వర్గాల మహిళలు సౌకర్యంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. స్కీమ్ అమలు అయిన తర్వాత ఏపీలో బస్సుల రద్దీ కూడా పెరిగింది.
Also Read: Building in Visakha: విశాఖలో పక్కకు ఒరిగిన ఐదు అంతస్తుల భవనం.. జనాలు పరుగులు
టెక్నాలజీ తోడైతే ప్రయాణం ఈజీ
టెక్నాలజీ వినియోగం వల్ల ప్రయాణం మరింత సులభమైందని ఆర్టీసీ అధికారులు కూడా చెబుతున్నారు. ఒక RTC అధికారి మాట్లాడుతూ, “ప్రతిసారీ ఐడీ వెతకడం కష్టంగా అనిపించే వారికి ఈ వాల్పేపర్ ఐడియా చాలా ఉపయోగపడుతోంది. టికెట్ ఇష్యూలు తగ్గాయి, టైమ్ కూడా సేవ్ అవుతోంది” అని వివరించారు.
మహిళల సృజనాత్మకతకు నెటిజన్ల ఫిదా
సోషల్ మీడియాలో ఈ ట్రెండ్పై నెటిజన్లు పాజిటివ్గా స్పందిస్తున్నారు. మహిళల క్రియేటివిటీకి సెల్యూట్, టెక్నాలజీని ఇలా వాడతారని ఊహించలేదు, బస్సు ప్రయాణం ఇప్పుడు హ్యాసిల్ ఫ్రీ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
భవిష్యత్తులో కొత్త ప్లాన్స్
ఆర్టీసీ అధికారులు కూడా ఈ ట్రెండ్ను దృష్టిలో ఉంచుకుని, త్వరలో ప్రత్యేక QR ఆధార్ స్కానింగ్ యాప్ను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు. దీంతో టికెట్ ఇష్యూలు మరింత సులభమవుతాయని చెబుతున్నారు.
స్త్రీ శక్తి ఫ్రీ బస్ స్కీమ్ మహిళలకు నిజంగా వరంగా మారింది. దానికి తోడుగా టెక్నాలజీని చాకచక్యంగా వినియోగించుకున్న మహిళలు ఇప్పుడు ట్రావెల్లో కొత్త పంథాను సృష్టిస్తున్నారు. ఒక్క ఫోన్ స్క్రీన్తో జీరో టికెట్.. అదీ ఏపీలోనే సాధ్యమైందని చెప్పాలి.