E-Paper
Advertisement

APPSC Group – 1 Mains Cancelled: గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై హైకోర్టులో అప్పీల్.. అత్యవసర విచారణకు ఆమోదం!

APPSC Group – 1 Mains Cancelled: గ్రూప్-1 మెయిన్స్ రద్దుపై హైకోర్టులో అప్పీల్.. అత్యవసర విచారణకు ఆమోదం!
AP High Court on group 1 exam
AP High Court

Appeal in AP High Count on APPSC Group 1 Mains Cancel(AP updates): 2018 గ్రూప్‌-1 మెయిన్స్ రద్దును సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ అప్పీల్‌ చేశాయి. ఇటీవలే సింగిల్ జడ్జి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పునిచ్చాయి. అయితే ఈ అప్పీల్ ను స్వీకరించిన హైకోర్టు అత్యవసర విచారణ కింద దీన్ని విచారించనున్నట్లు తెలిపింది. ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ చేసిన అప్పీల్ పై మంగళవారం విచారణ జరుపుతామని ఏపీ ధర్మాసనం స్పష్టం చేసింది.

2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018)ను ఏపీ హైకోర్టు ఇటీవలే రద్దు చేసింది. ఇరువైపులా వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో జవాబుపత్రాల మూల్యాంకనం సరిగ్గా జరగలేదని తేల్చిచెప్పింది. రెండోసారి, మూడోసారి ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూల్యాంకనంలో కూడా అవకతవకలు ఉన్నట్లు ధర్మాసనం గుర్తించింది. ఈ రెండూ పేపర్ల మూల్యాంకనంలో సరైన పద్దతులు అనుసరించిన చట్టవిరుద్దమని చెప్తూ.. 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాను రద్దు చేసింది. తాజాగా నిబంధనలకు అనుగుణంగా ప్రధాన పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది.

అప్పట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏపీ ప్రభుత్వం, ఏపీపీఎస్సీ నిర్వహించింది. అయితే జవాబు పత్రాల ముల్యాంకనం మాన్యువల్ పద్దతిలో రెండు సార్లు చేసి తమకి కావాల్సిన వారిని ప్రభుత్వం ఎంపిక చేసుకుని ఫలితాలు ప్రకటించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం మెయిన్స్ పేపర్లను పలుమార్లు మూల్యాంకనం చట్టవిరుద్ధమని ఏపీపీఎస్సీ విడుదల చేసిన జాబితాను రద్దు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీపీఎస్సీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేశారు. అయితే ఈ అప్పీల్ ను హైకోర్టు అత్యవసర విచారణ కింద మంగళవారం విచారించనున్నట్లు వెల్లడించింది.

Also Read: YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ..!

167 గ్రూప్-1 పోస్టుల భర్తీకి 2018లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన మెయిన్స్ జాబితాను రద్దు చేసింది. దీంతో అప్పట్లో ఉద్యోగాలు పొందినవారు ఒక్కసారిగా ఆందోళ చెందారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం వారికి హామీ ఇచ్చింది. ఉద్యోగుల ప్రయోజనాల కోసం తాము సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్తామని గతంలోనే స్పష్టం చేసింది.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×