E-Paper
Advertisement

Social Media: సోషల్ మీడియా వ్యవహారం.. బ్యాన్ చేసే అవకాశం, మంత్రుల టీమ్ భేటీ

Social Media: సోషల్ మీడియా వ్యవహారం..  బ్యాన్ చేసే అవకాశం, మంత్రుల టీమ్ భేటీ
Advertisement

Social Media: సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోనుంది. అందుకోసం మంత్రి లోకేష్‌ ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సోషల్ మీడియా వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసలు సోషల్ మీడియా వ్యవహారం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.

సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం?

Advertisement

రాష్ట్రంలో 13 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు ఓ ప్రకటన చేశారు. దీనిపై మూడు నెలల్లో విధివిధానాలను ఖరారు చేస్తామని వెల్లడించారు. దీనివల్ల పిల్లలకు నష్టం జరగకూడదన్నది తమ ఆలోచనగా చెప్పుకొచచారు.

13 నుంచి 16 ఏళ్ల వయసువారు సోషల్ మీడియా వాడకంపై నిర్ణయం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో మంత్రుల బృందం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సోషల్ మీడియాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తొలుత చిన్నారులపై ఉపయోగించకుండా సోషల్ మీడియా ను నిషేధించాలనే అభిప్రాయాన్ని బయటపెట్టారు.

Advertisement

​16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసే దిశగా కసరత్తు

ఆ తర్వాత కర్ణాటక, గోవాలు వేగంగా అడుగులు వేశాయి. ఈ విషయమై కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య కూడా అసెంబ్లీలో సోషల్ మీడియాను నిషేధించే అంశంపై ప్రకటన చేశారు. పిల్లలపై సోషల్ మీడియా దుష్ప్రభావం నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసెంబ్లీలో చెప్పిన విషయం తెల్సిందే.

పిల్లలు మొబైల్‌ వినియోగం వల్ల తలెత్తుతున్న ప్రతికూల భావాలను నివారించడానికే ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. గతేడాది ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించడంపై నిషేధం విధించింది. దాని తర్వాత మిగతా దేశాలు అదే దారిలో వెళ్తున్నాయి.

ALSO READ: ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు.. తనకు అర్హత లేదని వ్యాఖ్య 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×