E-Paper
Advertisement

ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య

ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్.. డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య

Andhra university:కొందరు రాజకీయ నేతలు సమయం, సందర్భం వచ్చినప్పుడు కొన్ని నిజాలు చెబుతారు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా అస్సల పట్టించుకోరు. చెప్పాల్సిన విషయాలను బయటపెడతారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అదే చేశారు. తనకు యూనివర్సిటీలకు రావడానికి అర్హత లేదని మనసులోని మాట బయటపెట్టారు.

విశాఖలో ఏయూలో మెగా కల్చరల్ ఫెస్టివల్

బుధవారం విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో మెగా కల్చరల్ ఫెస్టివల్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సిటీలకు రావడానికి తను ఏమాత్రం అర్హత లేదన్నారు. అర్హత లేకున్నా ప్రేమతో పిలవడంతో వచ్చానని మనసులోని మాట బయటపెట్టారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత నుంచి ఎదురయ్యే ప్రశ్నలు చాలా కష్టంగా ఉంటాయన్నారు. రాష్ట్ర పునః నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు. మీ చర్యలు, మీ విజ్ఞానం, ఆలోచనలు పరిష్కార మార్గాలుగా మారాలన్నారు. బలమైన నమ్మకంతో కలలు కనాలని, నిరంతర కృషి, నిబద్ధతతో నాయకత్వం వహించాలన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు, తనకు అర్హత లేదని వ్యాఖ్య

భావితరమే తనను రాజకీయాల్లోకి తీసుకుని వచ్చిందన్నారు. భగత్‌సింగ్ సహా చిన్న వయసులో ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు స్పూర్తిగా ప్రస్తావించారు. చదివిన చదువు వృథా కాదని, తాను యూనివర్సిటీకి వెళ్లలేదని, కానీ పీహెచ్‌డీ విద్యార్థి మాదిరిగా పుస్తకాలు చదువుతానని అన్నారు.

సాంప్రదాయ విద్య లేకపోవడం తనకు మంచి జరిగిందని అనుకుంటానని వెల్లడించారు. వందశాతం మంచి అనేది ఏ వ్యక్తిలోనూ ఉండదని, కేవలం ఎదుటివాళ్లను మంచిని చూడడం అలవాటు చేసుకోవాలన్నారు. తాను కూడా అదే ఫాలో అవుతానని తెలిపారు. సమాజం పిరికి తనంతో ముడుచుకుపోయినప్పుడు తాను రాజకీయ పోరాటం మొదలెట్టానన్నారు. ఓటమికి సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ALSO READ: చంద్రబాబును వెంటాడుతున్న జనాల భయం..!

పవన్ కళ్యాణ్ సహా రాజకీయ నాయకులు ఎవరు నచ్చకపోయినా పక్కన పడేయాలన్నారు. పార్టీల సిద్ధాంతాలు ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుకూలమా ఉన్నాయా లేవా అనేది నిర్ణయించుకోవాలన్నారు. వాస్తవిక దృక్పథం లేని ఐడియాలజీ నమ్ముకుని అడవులకు వెళ్లిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. పాతికేళ్లు రాజకీయాల్లో ఉంటానని నలిగి, దెబ్బతిని మాట్లాడుతున్నానని వెల్లడించారు.

 

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×