Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కాన్వాయ్కు ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన 63 అడుగుల భారీ గణపతి విగ్రహాన్ని దర్శించుకుని, ఆయన తిరుగు ప్రయాణమైన సమయంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
గవర్నర్ కాన్వాయ్ కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఒక గుర్తు తెలియని వ్యక్తి వాహనాలకు అడ్డుగా వచ్చాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది , పైలట్ వాహన డ్రైవర్ అత్యంత చాకచక్యంతో, సమయస్ఫూర్తితో స్పందించారు. వెంటనే వాహనాలను నియంత్రించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా గవర్నర్ సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఆకస్మిక పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. కాన్వాయ్కు అడ్డుగా వచ్చిన ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించడం వల్లే పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
Also Read: కేసీఆర్ చిటికె వేస్తే కాంగ్రెస్ నాయకులు ఊళ్లలో తిరగలేరు: జీవన్ రెడ్డి