E-Paper
Advertisement

AP RTI Commissioners: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్ గా వజ్జా శ్రీనివాసరావు

AP RTI Commissioners: ఏపీ ఆర్టీఐకి నలుగురు కమిషనర్లు నియామకం.. చీఫ్ గా వజ్జా శ్రీనివాసరావు
Advertisement

AP RTI Commissioners: ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్‌కు ప్రభుత్వం నలుగురు కమిషనర్లను నియమించింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. కమిషనర్లుగా వి.శరత్‌ చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల సర్వీస్‌ లేదా 65 ఏళ్లు వచ్చే వరకు వీరు ఆర్టీఐ కమిషనర్లుగా పదవిలో కొనసాగుతారు.

నలుగురూ న్యాయవాదులే

ప్రధాన కమిషనర్‌గా ప్రముఖ న్యాయవాది వజ్జా శ్రీనివాసరావును నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆర్టీఐలో ముగ్గురు కమిషనర్లు ఉండగా..తాజాగా మరో నలుగురిని నియమించారు. ప్రస్తుతం నియమితులైన నలుగురూ న్యాయవాదులే కావడం విశేషం. కడపకు చెందిన రవి యాదవ్‌, అనంతపురానికి చెందిన ఆదెన్న, విశాఖకు చెందిన సింహాచలం నాయుడు పేర్లు జాబితాలో ఉన్నాయి.

Advertisement

Also Read: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్

ఎంపిక విధానం ఇలా

ఆర్టీఐ కమిషనర్లను ఎంపిక చేసేందుకు సెలెక్షన్‌ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ముఖ్యమంత్రి, సీనియర్‌ మంత్రి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేకపోవడంతో మరో సీనియర్‌ మంత్రిని కమిటీలోకి తీసుకున్నారు. ఈ కమిటీ ఎంపిక చేసిన పేర్లను గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. గవర్నర్ ఆమోదం లభించడంతో.. ఆర్టీఐ ప్రధాన కమిషనర్‌తోపాటు కమిషనర్ల పేర్లను సీఎస్ ప్రకటించారు.

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×