E-Paper
Advertisement

AP Govt: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్

AP Govt: ఏపీ సర్కార్ సంక్రాంతి కానుక.. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు క్లియర్
Advertisement

AP Govt: ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు సంక్రాంతి కానుక ఇచ్చింది. డీఏ, డీఆర్ ఎరియర్స్, పెండింగ్‌ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్‌ చేసింది. డీఏ, డీఆర్‌ ఎరియర్స్‌, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపునకు రూ.2,653 కోట్ల నిధులను సోమవారం విడుదల చేసింది. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్‌ ఎరియర్స్‌ కోసం రూ.1,100 కోట్లు విడుదల చేసింది. పోలీసుల సరెండర్‌ లీవులకు రూ.110 కోట్లు, ఈఏపీ, నాబార్డ్‌, సాస్కీ, సీఆర్‌ఐఎఫ్‌ పనులకు కాంట్రాక్టర్లకు రూ.1,243 కోట్లు రిలీజ్ చేసింది. మొత్తం 5.7 లక్షల మందికి లబ్ధిచేకూరింది.

పోలీసులకు సరెండర్ లీవ్ నిధులు

డీఏ, డీఆర్ ఎరియర్స్ చెల్లింపులతో 2.25 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు, 2.70 లక్షల మంది పింఛన్ దారులకు లబ్ధి చేకూరనుంది.పోలీసులకు ఇవ్వాల్సిన సరెండర్ లీవ్‌లలో రూ.110 కోట్లు విడుదల చేశారు. దీంతో సుమారు 55 వేల మంది పోలీసులకు సరెండర్ లీవ్ ల నిధులు చెల్లించనున్నారు. ఈఏపీ, నాబార్డు, సాస్కీ, సీఆర్ఐఎఫ్ పనులకు రూ. 1243 కోట్ల విడుదల చేశారు. ఇందులో నీరు-చెట్టు బిల్లుల కింద సుమారు రూ.40 కోట్లు విడుదల చేశారు.

19 వేలకు పైగా కాంట్రాక్టర్లకు

Advertisement

నీరు-చెట్టు సహా వివిధ పనులు చేపట్టిన 19 మంది కాంట్రాక్టర్లకు ఏపీ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేసింది. మొత్తంగా 5.70 లక్షల మందికి సంక్రాంతి పండుగ కానుకగా పెండింగ్ బిల్లులు నిధులు విడుదల చేసింది.

Also Read:  ఏపీలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ.. కొత్త పోస్టింగ్ లు వీరికే

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×