E-Paper
Advertisement

AP Helicopter Politics: జగన్ విహారయాత్రకు రూ.222 కోట్ల ఖర్చు.. నిజం బయటపడిందంటూ మంత్రి లోకేష్ కౌంటర్

AP Helicopter Politics: జగన్ విహారయాత్రకు రూ.222 కోట్ల ఖర్చు.. నిజం బయటపడిందంటూ మంత్రి లోకేష్ కౌంటర్
Advertisement

AP Helicopter Politics: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవీకాలంలో విమాన ప్రయాణాలకు రాష్ట్ర ఖజానా నుండి రూ.222 కోట్లు డ్రా అయ్యాయని టీడీపీ ఆరోపిస్తుంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ విమానాల్లోనే ప్రయాణాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. దీంతో చార్టర్డ్ హెలికాఫ్టర్ ప్రయాణాలపై ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. మంత్రి నారా లోకేష్ తరచుగా హైదరాబాద్‌కు విమాన ప్రయాణాలు చేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించడంతో వివాదం మొదలైంది.

77 ప్రయాణాలకు సొంత నిధులే

కొడమల సురేష్ బాబు దాఖలు చేసిన ఆర్టీఐలో మంత్రి లోకేష్ విమాన ప్రయాణాలకు శాఖాపరంగా ఎలాంటి ఖర్చులు చెల్లించలేదని ప్రభుత్వం తెలిపింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, సమాచార సాంకేతికత, రియల్-టైమ్ గవర్నెన్స్ శాఖలు కలిగిన మంత్రి లోకేష్ తన సొంత డబ్బులతోనే 77సార్లు హైదరాబాద్ కు ప్రయాణించారని ఆర్టీఐ స్పష్టం చేసింది. దీంతో వైసీపీ చేసిన ఆరోపణలకు టీడీపీ చెక్ పెట్టినట్లు అయింది. అలాగే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విమాన ప్రయాణ ఖర్చులు విడుదల చేసింది టీడీపీ.

ఏపీ ఏవియేషన్ లెక్కలు ఇలా

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లెక్కల ప్రకారం 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్ విమాన ప్రయాణానికి రూ. 222.85 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని తేలింది. 2019-20లో రూ. 31.43 కోట్లు, 2020-21లో రూ. 44 కోట్లు, 2021-22లో రూ. 49.45 కోట్లు, 2022-23లో రూ. 47.18 కోట్లు మరియు 2023-24లో రూ. 50.81 కోట్లు ఖర్చు చేశారు. ఫిక్స్‌డ్-వింగ్ విమానాల కోసం రూ. 112.50 కోట్లు, హెలికాప్టర్ ఛార్జీల కోసం రూ. 87.02 కోట్లు, సిబ్బంది, నిర్వహణ వంటి నిర్వహణ ఖర్చుల కోసం రూ. 23.31 కోట్లు ఖర్చు చేసినట్లు గణాంకాలు స్పష్టం చేశాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో అధికారిక పర్యటనలన్నింటికీ మంత్రి లోకేష్ తన వ్యక్తిగత నిధులను ఉపయోగించుకున్నారని టీడీపీ తెలిపింది. జగన్ ఐదు సంవత్సరాల పాలనలో విమాన ప్రయాణానికి రాష్ట్ర ఖజానా నుండి రూ.222 కోట్లు తీసుకున్నారని టీడీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేసింది.

18 నెలల్లో లోకేశ్ ‘సున్న’ ఖర్చు

Advertisement

“మంత్రిగా ఉన్న 18 నెలల్లో, నారా లోకేష్ తన పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లు/ప్రత్యేక విమానాల కోసం ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా 60 నెలల్లో, జగన్ తన పర్యటనలకు ఉపయోగించే హెలికాప్టర్లు/ప్రత్యేక విమానాల కోసం ప్రభుత్వ ఖజానా నుండి రూ.222 కోట్లు ఖర్చు చేశారు” అని టీడీపీ సోషల్ మీడియాలో పేర్కొంది.

Also Read: Ap Liquor Case: సీఎం చంద్రబాబుకు ఉపశమనం.. లిక్కర్ కేసు మూసివేత!

ఈ విషయంపై మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… ‘ప్రజలు ఉద్యోగాలు, సౌకర్యాల కోసం కష్టపడుతున్నప్పుడు, వారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక రాజభవనానికి రూ.500 కోట్లు, విహారయాత్రకు రూ.222 కోట్లు ఖర్చు చేశారు. చివరకు నిజం బయటపడింది’ అని అన్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×