BigTV English

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. అప్పటి వరకు జీవో నెం.1 సస్పెండ్..

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్.. అప్పటి వరకు జీవో నెం.1 సస్పెండ్..
Advertisement

AP High Court : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్రంలోని రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిర్వహణకు అనుమతులు లేవంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ నెల 23 వరకు ఆ జీవోను సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


జీవో నెం.1ని రద్దు చేయాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం కుట్ర పూరితంగా జీవో జారీ చేసిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనల తర్వాత ప్రభుత్వం జారీ చేసిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది. జీవో నెంబర్ 1ని ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది.

జీవో నంబర్ 1ని ప్రభుత్వ తీసుకురావగానే రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని రాజకీయ ప్రక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ భేటీ తర్వాత ఇదే విషయాన్ని ప్రస్తావించారు. జీవో నెంబర్ 1 ని ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు పోరాడతామని చెప్పారు. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంటుందా? హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి జీవో అమలుకే ప్రయత్నం చేస్తుందా చూడాలి. నెల్లూరు జిల్లా కందుకూరు, గుంటూరులో టీడీపీ సభల్లో తొక్కిసలాట దుర్ఘటనలు జరిగి మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ప్రభుత్వం…జీవో నెంబర్ 1 ను తీసుకొచ్చింది.


Related News

Rain Alert: రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 రాష్ట్రాలకు IMD రెడ్ అలర్ట్!

Tirumala Diwali Asthanam: తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా దీపావళి ఆస్థానం.. ఆర్జిత సేవలు రద్దు

Nara Lokesh: ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం.. ఆస్ట్రేలియాలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటి

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

CM Progress Report: విశాఖలో గూగుల్ ఉద్యోగులకు దీపావళి కానుక

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Big Stories

×