E-Paper
Advertisement

Raghu rama Raju Third Degree Case: రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు..ఏపీ పోలీసులకు చిక్కిన ఐపీఎస్ అధికారి

Raghu rama Raju Third Degree Case: రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు..ఏపీ పోలీసులకు చిక్కిన ఐపీఎస్ అధికారి
Advertisement

Raghu rama Raju Third Degree Case: మాజీ ఎంపీ రఘరామరాజు థర్డ్ డిగ్రీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఓ అడుగు ముందుకుపడితే.. మరొక అడుగు వెనక్కి వెళ్తోంది. తాజాగా బీహార్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఇకపై వేగవంతం కానుంది.

రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు కొత్త మలుపు

Advertisement

వైసీపీ హయాంలో నమోదు చేసిన కేసులు స్పీడందుకున్నాయి.  మాజీ ఎంపీ రఘరామరాజు థర్డ్ డిగ్రీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్‌లో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రావాలని కొంతకాలంగా పలుమార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పరిస్థితి గమనించిన ఏపీ పోలీసులు నేరుగా రంగంలోకి దిగేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు జోరందుకోనుంది.  వైసీపీ రూలింగ్‌లో ఏపీ సీఐడీలో డిప్యుటేషన్‌పై పని చేశారు సునీల్ నాయక్. 2021లో రఘురామకృష్ణంరాజు అరెస్టు చేసిన సమయంలో సీఐడీ కస్టడీలో సునీల్ నాయక్ నేతృత్వంలో టీమ్ ఆయన్నివిచారించింది.

Advertisement

సీనియర్ ఐపీఎస్‌ని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

ఆ సమయంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కాళ్లపై కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామరాజు.

ఈ కేసు వ్యవహారం గురించి తొలుత బీహార్ ప్రభుత్వానికి ఏపీ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్నాలోని స్థానిక కోర్టులో ఆయన్ని హాజరు పరిచారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి లభించడంతో ఆయన్ని సోమవారం సాయంత్రానికి గుంటూరు తీసుకురానున్నారు.

ALSO READ:  తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్

సునీల్ నాయక్ అరెస్టుతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు ఈ కేసుతో స్పష్టమైంది. ఇదే కేసులో మరికొందరు ఉన్నతాధికారులు విచారణ చేసే అవకాశమున్నట్లు అమరావతి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×