E-Paper
Advertisement

APPSC: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం!

APPSC: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం!
Advertisement
APPSC Latest News

APPSC Latest News: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. అయితే ఒకేరోజు రెండు పరీక్షలు పడటంతో సతమతమవుతున్న ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ ఎగ్జామ్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు ఒకే రోజు ఉన్నాయి. పరీక్షల తేదీలో మార్పు చేయాలంటూ ఎస్బీఐకు ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.

ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లర్కు పరీక్ష ఉంది. అయితే అదే రోజు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. కొంతమంది అభ్యర్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవటంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ తీరుపై ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడం ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ అభ్యర్థులు. ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజునే.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సాధారణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షల తేదీని ఖరారు చేసేటప్పుడు ఇతరత్రా పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు.

Read More: ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..

Advertisement

అయితే ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని షెడ్యూల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్షల తేదీని మర్చాలని ఎస్‌బీఐకు లేఖ రాసింది ఏపీపీఎస్సీ. అయితే లేఖపై ఎస్‌బీఐ ఎలా స్పందిస్తుందనేదీ చూడాలి మరి.

Tags

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×