BigTV English

APPSC: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం!

APPSC: నిరుద్యోగులకు ఉపశమనం.. ఒకేరోజు రెండు పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం!
APPSC Latest News

APPSC Latest News: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. అయితే ఒకేరోజు రెండు పరీక్షలు పడటంతో సతమతమవుతున్న ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ ఎగ్జామ్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షలు ఒకే రోజు ఉన్నాయి. పరీక్షల తేదీలో మార్పు చేయాలంటూ ఎస్బీఐకు ఏపీపీఎస్సీ కార్యదర్శి లేఖ రాశారు.


ఫిబ్రవరి 25న ఎస్‌బీఐ క్లర్కు పరీక్ష ఉంది. అయితే అదే రోజు ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 పరీక్షను నిర్వహిస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు అయోమయంలో పడిపోయారు. కొంతమంది అభ్యర్థులు రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవటంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే హాజరవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ తీరుపై ఉద్యోగ అభ్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జాతీయస్థాయి పరీక్షలను పరిగణనలోకి తీసుకోకుండా.. గ్రూప్-2 పరీక్ష తేదీని నిర్ణయించడం ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగ అభ్యర్థులు. ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్ష జరుగుతున్న రోజునే.. గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను షెడ్యూల్ చేయడం ఏంటని ప్రశ్నించారు. సాధారణంగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి పరీక్షల తేదీని ఖరారు చేసేటప్పుడు ఇతరత్రా పరీక్షల షెడ్యూల్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు.


Read More: ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..

అయితే ఏపీపీఎస్సీ ఏమీ ఆలోచించకుండానే గ్రూప్ -2 ప్రిలిమ్స్ పరీక్ష తేదీని షెడ్యూల్ చేసిందనే విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ క్లరికల్ మెయిన్స్ పరీక్షల తేదీని మర్చాలని ఎస్‌బీఐకు లేఖ రాసింది ఏపీపీఎస్సీ. అయితే లేఖపై ఎస్‌బీఐ ఎలా స్పందిస్తుందనేదీ చూడాలి మరి.

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×