E-Paper
Advertisement

Amrit Bharat Express: మరో 50 అమృత్ భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. రైల్వే మంత్రి ట్వీట్..

Amrit Bharat Express: మరో 50 అమృత్ భారత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్.. రైల్వే మంత్రి ట్వీట్..
Amrit Bharat Express

Amrit Bharat Express: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రజల నుంచి స్పందన చూసాక కేంద్రం మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా 50 రైళ్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

అమృత్ భారత్ రైళ్లు భారీ విజయం సాధించాయని మంత్రి పేర్కొన్నారు. దీంతో మరో 50 రైళ్లకు ఆమోదం తెలిపినట్టు తెలిపారు. ఇప్పటివరకు రెండు అమృత్ భారత్ రైళ్లు పట్టాలెక్కాయి. ఒక రైలు వెస్ట్ బెంగాల్‌లోని మాల్టా నుంచి కర్ణాటకలోని బెంగళూరు మధ్య నడుస్తోంది. ఈ రైలు ఆంధ్ర ప్రదేశ్ గుండా ప్రయాణిస్తోంది. ఇంకొక అమృత్ భారత్ రైలు బిహార్‌లోని దర్భాంగా నుంచి ఢిల్లీ ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య నడుస్తోంది. ఈ రెండు రైళ్లకు విశేష స్పందన లభించడంతో కేంద్ర ప్రభుత్వం మరో 50 రైళ్లను ప్రవేశపెట్టనుంది.

Read More: పశ్చిమ బెంగాల్ అధికారులపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు.. లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు స్టే..

అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇవి పూర్తిగా ఎల్‌ఎహ్‌బీ బోగీలు. ఇందులో 12 స్లీపర్ కోచ్‌లు, 8 జనరల్ కోచ్‌లతో పాటు 2 లగేజీ కోచ్‌లు ఉంటాయి. పూర్తిగా అధునాతన సాంకేతికతతో తక్కువ సమయంలోనే ఎక్కువ స్పీడ్‌ను అందుకునేలా వీటిని డిజైన్ చేశారు. ఈ రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. 1800 మంది ప్రయాణించేలా అమృత్ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను డిజైన్ చేశారు. ఈ రైళ్లు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను కలుపుతాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×