E-Paper
Advertisement

Good News: ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..

Good News: ఎన్నికల వేళ.. ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్..
Advertisement
IIM Visakhapatnam News

IIT Tirupati, IIM Visakhapatnam(Latest andhra news in telugu): ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించిన వేళ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ వస్తోన్న రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను అంకితం చేయనుంది కేంద్ర ప్రభుత్వం. వాటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించనున్నారు.

ఈ రెండు ప్రాజెక్టులు కూడా విద్యా రంగానికి సంబంధించినవే. వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు చెందినవే కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. వీటి వల్ల ఈ రెండు ప్రాంతాలు ఎడ్యుకేషనల్ హబ్‌గా గుర్తింపు పొందే ఆస్కారం ఉంది.

Advertisement

ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒకటి తిరుపతి సమీపంలో నిర్మితమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాగా.. రెండవది విశాఖపట్నం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్. ఐఐటీ-తిరుపతి, ఐఐఎం విశాఖపట్నంలను ఈ నెల 20న ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ విధానంలో వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

Read More:  రాష్ట్రానికి ఏం చేశావని ఓటు అడుగుతావు.. చంద్రబాబును ప్రశ్నించిన సజ్జల..

Advertisement

వీటితో పాటు దేశవ్యాప్తంగా పలు ఐఐటీలు, ఐఐఎస్, ఐఐఎంలు, ఐఐఐటీడీఎం, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలను ప్రధాని ప్రారంభిస్తారు. ఐఐటీ- భిలాయ్, ఐఐటీ- జమ్మూ, ఐఐఐటీడీఎం- కాంచీపురం పూర్తిస్థాయి క్యాంపస్‌ను మోదీ జాతికి అంకితం చేయనున్నారు.

వాటన్నింటితో పాటు ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని నిర్మించినటువంటి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్, ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ, అగర్తలలో నిర్మించిన సెంట్రల్ సంస్కృత యూనివర్శిటీని మోదీ క్యాంపస్‌ను ప్రారంభించనున్నారు. త్వరలోనే వాటిని అందుబాటులోకి తీసుకుని రానున్నారు. వాటన్నింటి విలువ సుమారు 13,375 కోట్ల రూపాయలు ఉంటుంది.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×