E-Paper
Advertisement

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..
Advertisement

Nellore News Today Telugu(AP Political News) : నెల్లూరులో పట్టపగలే దుండగులు బరితెగించారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు.

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. అందువల్లే వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఆనంపై దాడికి ప్రయత్నం జరిగిందనే విషయం తెలియగానే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని వెంకటరమణారెడ్డితో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి తప్పుపట్టారు. వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలిపితే.. ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించిన ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ఇది వైసీపీ మూకల పనే అని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్‌ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×