BigTV English
Advertisement

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..

Nellore News Today Telugu(AP Political News) : నెల్లూరులో పట్టపగలే దుండగులు బరితెగించారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు.


కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. అందువల్లే వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఆనంపై దాడికి ప్రయత్నం జరిగిందనే విషయం తెలియగానే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని వెంకటరమణారెడ్డితో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి తప్పుపట్టారు. వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలిపితే.. ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.


ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించిన ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ఇది వైసీపీ మూకల పనే అని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్‌ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×