E-Paper
Advertisement

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..

Nellore : టీడీపీ నేత ఆనంపై దాడికి ప్రయత్నం.. వైసీపీ ఫ్యాక్షన్ ముఠాల పనేనని లోకేశ్‌ ఆరోపణ..
Advertisement

Nellore News Today Telugu(AP Political News) : నెల్లూరులో పట్టపగలే దుండగులు బరితెగించారు. టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన ఆర్టీఏ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా 10 మంది బైక్‌లపై వచ్చి కర్రలతో దాడికి యత్నించారు. వెంటనే టీడీపీ కార్యకర్తలు, ఆనం అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో దుండగులు అక్కడికి నుంచి పరారయ్యారు.

కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ విధానాలపై ఆనం వెంకటరమణారెడ్డి ఘాటు విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారంటూ అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించారు. అందువల్లే వైసీపీ కార్యకర్తలే ఈ దాడికి ప్రయత్నించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement

ఆనంపై దాడికి ప్రయత్నం జరిగిందనే విషయం తెలియగానే సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కొంతమంది టీడీపీ నేతలు అక్కడికి చేరుకుని వెంకటరమణారెడ్డితో మాట్లాడారు. వివరాలు తెలుసుకున్నారు. ఆనం వెంకటరమణారెడ్డిపై దాడి యత్నాన్ని సోమిరెడ్డి తప్పుపట్టారు. వైసీపీ నాయకులు బరితెగిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పట్టపగలు దాడులు చేసే కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దాడి జరిగిన సమాచారం పోలీసులకు తెలిపితే.. ఇద్దరు కానిస్టేబుళ్లను పంపి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.

ఆనం వెంకటరమణారెడ్డిపై దుండగులు దాడికి యత్నించిన ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఖండించారు. ఇది వైసీపీ మూకల పనే అని ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ఫ్యాక్షన్‌ ముఠాలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Related News

ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తారా? బిగ్ టీవీ వ్యవహారంపై నెటిజన్ల ఫైర్

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

Big Stories

Advertisement
×