E-Paper
Advertisement

Viveka Murder Case: అవినాశ్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!.. ఉదయ్ రిమాండ్ రిపోర్టులోనూ పేరు.. సీబీఐ వదిలేదేలే!!

Viveka Murder Case: అవినాశ్‌రెడ్డికి బిగుస్తున్న ఉచ్చు!.. ఉదయ్ రిమాండ్ రిపోర్టులోనూ పేరు.. సీబీఐ వదిలేదేలే!!
Advertisement
avinash reddy cbi

Viveka Murder Case (AP News Updates): వివేకా హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటిషన్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. వివేక హత్య గురించి ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి,శివ శంకర్ రెడ్డి కలిసి ఆధారాలు తారుమారు చేశారని రిపోర్టులో సీబీఐ వెల్లడించడం కలకలం రేపుతోంది.

హత్య తర్వాత ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళాడని.. గూగుల్ టేకౌట్‌లో తేలిందని సీబీఐ చెబుతోంది. వివేకా గుండెపోటుతో చనిపోయినట్టు చిత్రీకరించేందుకు.. ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారు. వివేకా డెడ్‌బాడీని బాత్రూం నుండి బెడ్‌రూంకి ఉదయ్ కుమారే తీసుకొచ్చాడని తేల్చింది. తన తండ్రి ప్రకాష్‌రెడ్డితో మృతదేహానికి కుట్లు వేయించాడని.. వివేక తలకు ఉన్న గాయాలు కనపడకుండా బ్యాండేజ్‌లు వేసారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది సీబీఐ. ఉదయ్ కుమార్ రెడ్డి పారిపోతాడనే అనుమానంతో అరెస్ట్ చేశామని స్పష్టం చేసింది.

Advertisement

“హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపి వేశారని అనేందుకు సాక్ష్యాలున్నాయి” అంటూ సీబీఐ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×