E-Paper
Advertisement

Avinashreddy : సీబీఐ విచారణకు మరోసారి అవినాష్ రెడ్డి హాజరు.. నెక్ట్స్ ఏంటి..?

Avinashreddy : సీబీఐ విచారణకు మరోసారి అవినాష్ రెడ్డి హాజరు.. నెక్ట్స్ ఏంటి..?
Advertisement

Avinashreddy : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ రెండుసార్లు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. తొలిసారి జనవరి 28న, రెండోసారి ఫిబ్రవరి 24న సీబీఐ అధికారులు కడప ఎంపీని ప్రశ్నించారు.

సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ గురువారం తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటివరకు రెండు అభియోగ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. వీటి ప్రకారం వివేకా హత్యపై గంగిరెడ్డి చెప్పారంటూ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మినహా తాను నేరంలో పాల్గొన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవని అవినాష్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఈ పిటిషన్‌లో వివేకా కుమార్తె సునీత కు ఇంప్లీడ్‌ అయ్యారు.

Advertisement

మరోవైపు వివేకా హత్య కేసులో చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ ఖైదీలుగా ఉన్న సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డితోపాటు గంగిరెడ్డి, దస్తగిరి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 12న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని కడపలో సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఆసక్తి రేగుతోంది.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×