E-Paper
Advertisement

Vishnu Kumar Sensational Comments: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎక్కడుందంటూ

Vishnu Kumar Sensational Comments: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు.. ఆ పార్టీ ఎక్కడుందంటూ
Advertisement

Vishnu Kumar Sensational Comments: విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఉండదని మనసులోని మాట బయటపెట్టారు. పార్టీ లేకుంటే వైసీపీకి కష్టకాలం ఎక్కడి నుంచి ఉంటుందన్నారు.

విశాఖలో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఉండదని, వైనాట్ 175 అన్నరోజునే ఆ పార్టీ పోయిందన్నారు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కొత్త పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయకపోతే ఉన్నవాళ్లు బయటకు వెళ్ళిపోతారన్నారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తుందన్నారు.

Advertisement

వైసీపీ నేతలు, నాయకులు మంచివాళ్ళు ఉన్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే. వైసీపీ నాయకులంతా ఇప్పుడు జీరోగా మారిపోయారన్నారు. వైసీపీలో నాయకులు అనవసరమన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి రాదని తేల్చేశారు.

మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి చాలా మంచి పని చేశారన్నారు విష్ణుకుమార్ రాజు. అవంతి మాటలు వింటుంటే పవన్‌పై ప్రేమ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ఆయన డైరెక్షన్ అటు వైపు చూస్తుందన్నారు. అవంతి శ్రీనివాస్ ఏ రోజు బీజేపీపై విమర్శలు చేయలేదని, మా పార్టీలోకి వస్తే తప్పేముందన్నారు. అవంతి మర్డర్ చేయలేదు అలాగని బియ్యం అమ్ముకోలేదన్నారు.

Advertisement

ALSO READ: జగన్ బెయిల్ రద్దు వ్యవహారం.. జనవరి 10న తేల్చేయడం ఖాయం?

అవంతి మంత్రి పదవి పోవడానికి కీలక కారణం చెప్పారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో ఫ్లెక్సీలపై జగన్‌తోపాటు అవంతి ఫోటో వేసుకోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి పోతుందని తాను అప్పుడే అనుకున్నానని వెల్లడించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఫ్లెక్సీ మీద మంత్రి ఫోటోను చూడలేదన్నారు. చివరకు బొత్స సత్యనారాయణ ఫోటో కూడా లేదన్నారు.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×