E-Paper
Advertisement

Nara Lokesh : ప్రజా దర్బార్ లో వెల్లువెత్తిన వినతులు.. మంత్రికి క్యాబ్ డ్రైవర్ల రిక్వెస్ట్

Nara Lokesh : ప్రజా దర్బార్ లో వెల్లువెత్తిన వినతులు.. మంత్రికి క్యాబ్ డ్రైవర్ల రిక్వెస్ట్

Cab Drivers Request to Minister Lokesh(AP news live): తెలంగాణ ప్రభుత్వం తమపై విధించిన నిబంధనలను తొలగించేలా చూడాలని ఏపీ క్యాబ్ డ్రైవర్లు మంత్రి నారా లోకేశ్ కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో క్యాబ్ డ్రైవర్లు ఆయన్ను కలిశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలం ముగియడంతో.. తమ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని తెలంగాణ అధికారులు చెబుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో తాము లైఫ్ ట్యాక్స్ కట్టామని, మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టే స్తోమత లేదని వివరించారు. ఏపీ వాహనాలపై హైదరాబాద్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాగా.. ఈ నెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల సీఎం లు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యలను కూడా పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ క్యాబ్ లకు హైదరాబాద్ లో మరికొంతకాలం పాటు లైఫ్ ట్యాక్స్ లేకుండా ఉండేలా ఊరటనిచ్చేలా అక్కడి వారితో మాట్లాడాలని కోరారు.

Also Read : ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా ? డిప్యూటీ సీఎం మాటల్లో ఆంతర్యమేమిటి ?

మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు నారా లోకేశ్. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రజాదర్బార్ కు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారని తెలిపారు. ఉండవల్లిలో తనను కలిసి వినతులను అందజేస్తున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత సిబ్బందిని అక్కడకక్కడే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రజాదర్బార్ లో తమ సమస్యలకు తక్షణమే పరిష్కారమార్గం లభిస్తుండటంతో.. సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు.

కాగా.. కావలిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ స్పందించారు. కావలి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని X వేదికగా ట్వీట్ చేశారు. బస్సుప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయాలపాలైన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్కూళ్ల యాజమాన్యాలు అన్ని బస్సుల కండీషన్ ను చెక్ చేయించుకోవాలి, ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×